E-Paper
Advertisement

Imam Ul Haq: ఇండియాలో నరకం చూశాం…బెడ్‌ రూం నుంచి బయటకు పంపలేదు !

Imam Ul Haq: ఇండియాలో నరకం చూశాం…బెడ్‌ రూం నుంచి బయటకు పంపలేదు !
Advertisement

Imam Ul Haq: 2023 వరల్డ్ కప్ ( world cup 2023) కోసం ఇండియాలో పర్యటించినప్పుడు తమకు నరకం కనిపించిందని… పాకిస్తాన్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హాక్ ( Imam Ul Haq ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాజాగా… ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. విషం కక్కాడు ఈ పాకిస్తాన్ క్రికెటర్ ఇమామ్ ఉల్ హాక్ ( Imam Ul Haq ) . వరల్డ్ కప్ కోసం వెళ్ళినప్పుడు… హోటల్ నుంచి బయటకు కూడా మమ్మల్ని వెళ్లనివ్వలేదని… ఆగ్రహించాడు ఇమామ్ ఉల్ హాక్ ( Imam Ul Haq ).

టీమిండియా ( Team India) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan ) మధ్య ప్రస్తుతం చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు ( ICC Champions Trophy 2025) సంబంధించిన పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవంగా ఐసీసీ రూల్స్ ప్రకారం పాకిస్తాన్ దేశంలోనే ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరగాల్సి ఉంది. అయితే పాకిస్తాన్లో చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025) జరిగితే… మేము వెళ్ళేది లేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. హైబ్రిడ్ మోడల్ లో ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నిర్వహించాలని…. ముందు నుంచి భారత్ డిమాండ్ చేస్తోంది.

Advertisement

Also Read: Imran Khan – Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్‌ లో ఇప్పటి వరకు..ఏ ప్లేయర్‌ కూడా సిక్సు కొట్టలేదు ?

అయితే పాకిస్తాన్ మాత్రం దీనికి అసలు ఒప్పుకోవడం లేదు. ఐసీసీ రూల్స్ ప్రకారం మా దేశంలోనే జరగాలని…. ఇండియా కూడా పాకిస్తాన్ కు రావాల్సిందేనని…. పిసిబి బోర్డ్ ప్రకటించింది. మొండి పట్టు పట్టింది. అయితే హైబ్రిడ్ మోడల్ లో భాగంగా దుబాయ్ లేదా సౌదీ అరేబియా లాంటి.. ఇతర దేశాలలో టోర్నమెంట్ నిర్వహిస్తే ఖచ్చితంగా వస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి… ఐసీసీకి తెలిపింది. అయితే దీనిపై పాకిస్తాన్ అలాగే టీమిండియాను ఒప్పించేందుకు… అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నానా కష్టాలు పడింది.

Advertisement

 

అయితే చివరికి హైబ్రిడ్ మోడల్ కే పాకిస్తాన్ తలోగ్గినట్లు సమాచారం. దీనికి కారణం ఇండియా ఈ టోర్నమెంట్ ఆడకపోతే ఐసీసీ తో పాటు పాకిస్తాన్ కు కూడా నష్టమే. కాబట్టి టీమిండియా డిమాండ్లను కచ్చితంగా పరిష్కరించాలి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్లో కూడా హైబ్రిడ్ మోడల్ కు ఒప్పించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( ICC Champions Trophy 2025) టీమిండియా ఆడే మ్యాచ్ లన్ని… దుబాయిలో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అయితే చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు ( ICC Champions Trophy 2025) సంబంధించిన షెడ్యూల్ కూడా త్వరలో రిలీజ్ కాబోతుంది. అయితే.. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లు విషం చెబుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఇమామ్ ఉల్ హాక్… 2023 ప్రపంచ కప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో ఇండియాలోనే వరల్డ్ కప్ జరిగింది. అప్పుడు ఇండియాకు పాకిస్తాన్ రావడం జరిగింది. అయితే ఆ సమయంలో పాకిస్తాన్ ప్లేయర్లకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు ఇమామ్. 2023 వరల్డ్ కప్ కోసం ఇండియాలో పర్యటించినప్పుడు…హోటల్‌ నుంచి కూడా మా ప్లేయర్లను బయటకు పంపలేదని తెలిపారు. ఎంత రిక్వెస్ట్‌ చేసినా బయటకు పర్మిషన్‌ ఇవ్వలేదని వివరించారు. అయితే.. సెక్యూరిటీ కారణంగా ఇండియన్‌ పోలీసులు అలా చేశారన్నారు. దాని వల్ల మాకు ఇబ్బంది అయిందన్నారు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×