BigTV English

Khalistan Supporters: బాక్సింగ్ డే టెస్టులో కలకలం.. మ్యాచ్ అడ్డుకునేందుకు ఖలిస్థానీల కుట్రలు?

Khalistan Supporters: బాక్సింగ్ డే టెస్టులో కలకలం.. మ్యాచ్ అడ్డుకునేందుకు ఖలిస్థానీల కుట్రలు?

Khalistan Supporters: ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా – భారత్ జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లోని 4వ (బాక్సింగ్ డే) టెస్ట్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఖలిస్థాని మద్దతుదారులు. మైదానంలో వారు {Khalistan Supporters} ఆందోళన చేయడం కలకలం సృష్టించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన విక్టోరియా పోలీసులు వారిని చెదరగొట్టారు. టికెట్ లేకుండా మైదానంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేశారు.


Also Read: Rohit Sharma – Yashasvi Jaiswal: ఓరేయ్ గల్లీ క్రికెట్ ఆడుతున్నావా.. జైస్వాల్ కు రోహిత్ వార్నింగ్ ?

ఓవైపు మ్యాచ్ జరుగుతుండగా.. మరోవైపు ఖలిస్థానీ జెండాలు పట్టుకుని భారత్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో భారత అభిమానులు, ఖలిస్థానీ అనుకూల వాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. అప్రమత్తమైన విక్టోరియా పోలీసులు వారిని {Khalistan Supporters} అక్కడినుండి పంపించేశారు. కి ఘటనపై భారత అభిమానులు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనకు అనవసరమైన ప్రచారం కల్పించవద్దని అన్నారు. వారు చేసిన ఆందోళనకు విలువ లేదని.. అసలు పంజాబ్ తో సంబంధమే లేని వ్యక్తులు వచ్చి కావాలనే గొడవ చేశారని వారు పేర్కొన్నారు.


ఇక మరోవైపు ఖలిస్థాని ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నున్ మరోసారి భారత్ పై బెదిరింపులకు పాల్పడ్డాడు. 2025 లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో జరగబోయే మహా కుంభమేళాలో{Khalistan Supporters} భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని చంపేస్తామంటూ ఓ వీడియోని విడుదల చేశారు. ముగ్గురు ఖలిస్థాని ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసినందుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డాడు.

అంతేకాదు 2025 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ లోపు ఈ దాడులు చేస్తామని హెచ్చరించాడు. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ మధ్య రోజుల్లో ప్రధాని మోదీ, సీఎం యోగి ప్రయాగ్రాజ్ లో ఉంటారు. ఈ మహా కుంభమేళానే ఈ ఇద్దరు నాయకులకు చివరిదిగా మారుతుందని అతడు వార్నింగ్ ఇచ్చాడు. అయితే పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో పోలీసు పోస్ట్ పై దాడి చేసిన కేసులో ముగ్గురు ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించిన పోలీసులు.. వారు ఉత్తర ప్రదేశ్ లోని పిలిబిత్ లోని పురాణ పూర్ లో ఉన్నట్లు గుర్తించారు.

Also Read: Sam Konstas: బుమ్రా బౌలింగ్ లో తొలి సిక్స్‌ కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు…చరిత్రలో తొలిసారి!

అనంతరం వారు ఉత్తరప్రదేశ్ పోలీసుల సాయంతో సోమవారం తెల్లవారుజామున ముగ్గురు నిందితులను చుట్టుముట్టారు. దీంతో ఉగ్రవాదులు ఎదురుకాల్పులు జరపడంతో హర్దోయ్ బ్రాంచ్ కెనాల్ సమీపంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ముగ్గురు ఖలిస్థాని కమాండో ఫోర్స్ కి చెందిన వారీగా గుర్తించారు. ఘటన స్థలం నుంచి పోలీసులు రెండు ఏకే 47, మరో రెండు పిస్టల్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఎన్కౌంటర్ పై ప్రతీకారం తీర్చుకుంటామని గురుపత్వంత్ సింగ్ ఓ వీడియోని విడుదల చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×