E-Paper
Advertisement

Ishan – Pant: రిషబ్ పంత్‌కు 6 వారాలు విశ్రాంతి.. ఇంగ్లాండ్ బయలుదేరిన SRH డేంజర్ ప్లేయర్ ?

Ishan – Pant: రిషబ్ పంత్‌కు 6 వారాలు విశ్రాంతి.. ఇంగ్లాండ్ బయలుదేరిన SRH డేంజర్ ప్లేయర్ ?
Advertisement

Ishan – Pant:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం 5 టెస్టుల సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నాలుగో టెస్ట్ జరుగుతుండగానే టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కు తీవ్రమైన గాయమైంది. అతని కాలికి నిన్న గాయం కావడంతో మ్యాచ్ మధ్యలోనే.. ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆరు వారాల పాటు రిషబ్ పంత్ కు విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. దీంతో అతన్ని ఇండియాకు పంపిస్తున్నారట. ఒకవేళ అదే జరిగితే.. సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు ఇషాన్ కిషన్… రంగంలోకి దిగుతాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అతన్ని ఇండియా నుంచి ఇంగ్లాండ్ కు తీసుకువస్తారని సమాచారం అందుతోంది.

Also Read: Sai Sudarshan: సాయి సుదర్శన్ సైంటిస్టుల రాస్తున్నాడు.. శిష్యుడిలా సుందర్ చూస్తున్నాడు… ఏంట్రా ఇద్దరి గోల.. ముందు టీమిండియాను గెలిపించండిరా

Advertisement

జురెల్ కు ఎదురుదెబ్బ.. రంగంలోకి హైదరాబాద్ ఆటగాడు ( Ishan Kishan )

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం నాలుగో టెస్ట్… మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కు తీవ్రమైన గాయం అయింది. ఈ మ్యాచ్ లో 37 పరుగులు చేసిన రిషబ్ పంత్… వొక్స్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడబోయాడు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ ఆటగాడు వేసిన బంతి నేరుగా… రిషబ్ పంత్ కాలికి తగిలింది. దీంతో అక్కడే కుప్పకూలినంత పని చేశాడు. అనంతరం అతని నొప్పి ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే గ్రౌండ్ నుంచి ఆసుపత్రికి తరలించారు.

Advertisement

అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రిషబ్ పంత్ ( Rishabh Pant)  కాలుకు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. స్కానింగ్ రిపోర్టులో అతని కాలు ఫ్రాక్చర్ అయినట్లు తేలిందట. దీంతో రిషబ్ పంత్ కు ఆరు వారాల పాటు రెస్ట్ అవసరమని చెబుతున్నారట వైద్యులు. అంటే ఈ ఐదు టెస్టుల సిరీస్ నుంచి దాదాపు రిషబ్ పంత్ దూరం కాబోతున్నట్లు సమాచారం అందుతుంది. దీంతో టీం ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగలడం గ్యారంటీ అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో… అదనంగా జూరెల్ వికెట్ కీపర్ గా ఉపయోగపడతాడు. కానీ అతన్ని టీమిండియా ఫైనల్ చేసే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. అతని కారణంగా గత మ్యాచ్ లో టీమిడియా ఓడిపోయిందని.. అలాంటిది మళ్లీ.. జురెల్ కు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. కాబట్టి రిషబ్ పంత్ స్థానంలో… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈశాన్ కిషన్ ను రంగంలోకి దింపబోతున్నారట. దేశవాళి క్రికెట్ లో కూడా ఇషాన్ కిషన్ అద్భుతంగా రానిస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే అతన్ని ఇంగ్లాండ్ కు తీసుకువచ్చేలా ఉన్నారు.

Also Read: Rishabh Pant Injury: రిషబ్ పంత్ తీవ్రమైన గాయం.. అంబులెన్స్ లో తరలింపు.. మొదటి రోజు మ్యాచ్ వివరాలు ఇవే

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×