E-Paper
Advertisement

Shafali Verma: ఆసీస్ తో సెమీస్‌..ప్రతీకా రావల్ ఔట్‌, టీమిండియాలోకి లేడీ కోహ్లీ

Shafali Verma: ఆసీస్ తో సెమీస్‌..ప్రతీకా రావల్ ఔట్‌, టీమిండియాలోకి లేడీ కోహ్లీ

Shafali Verma: మహిళల వ‌న్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో ( ICC Womens World Cup 2025 ) టీమిండియా దూసుకుపోతున్న నేపథ్యంలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఓపెనర్ ప్రతీకా రావల్ గాయం బారిన పడిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బంతి ఆపబోయి, కింద పడిపోయారు ప్రతీకా రావల్. దీంతో ఆమె కాలు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 30వ తేదీన ఆస్ట్రేలియాతో టీమిండియా సెమీ ఫైనల్ మ్యాచ్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ప్రతీకా రావల్ ( Pratika Rawal) సెమీ ఫైనల్ ఆడబోదని తెలుస్తోంది. గాయం తీవ్రతరం కావడంతో ప్రతీకా రావల్ స్థానంలో మరో డేంజర్ ప్లేయర్ ను దించుతున్నారు. ప్రతీకా రావల్ స్థానంలో షెఫాలీ వర్మ ( Shafali Verma ) జట్టులోకి రాబోతున్నారట. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.

Also Read: Australian women cricketers: ఆస్ట్రేలియా మహిళల జట్టును గెలికిన వాడికి థర్డ్ డిగ్రీ.. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు.. నడవలేని పరిస్థితి

ప్రతీకా రావల్ ఔట్‌, టీమిండియాలోకి లేడీ కోహ్లీ

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా సెమీ ఫైనల్ మ్యాచ్ లు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. రేపు ఇంగ్లాండు వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. ఎల్లుండి ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైట్ ఉంటుంది. అయితే ఎల్లుండి మ్యాచ్ ఉన్న నేపథ్యంలో… టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణిస్తున్న ప్రతీకా రావల్ ( Pratika Rawal) కు గాయం అయింది. బౌండరీ గేటు దగ్గర బంతిని ఆపబోయి ఆమె కాలు బెణికినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మహిళల వ‌న్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి వైదొలిగారు ప్రతీకా రావల్. దీంతో ప్రతీకా రావల్ స్థానంలో లేడి విరాట్ కోహ్లీ రంగంలోకి దిగుతున్నారు. షెఫాలీ వర్మ జట్టులోకి వస్తున్నారు. లేడీ కోహ్లీగా పేరు పొందిన షెఫాలీ వర్మ బ్యాటింగ్ లో దుమ్ము లేపుతారు. ప్రత్యర్థి ఎవరైనా సరే, ఓపెనర్ గా వచ్చినా, ఏ స్థానంలో బ్యాటింగ్ కు దింపినా షెఫాలీ వర్మ మాత్రం దుమ్ము లేపడం పక్క అంటున్నారు క్రీడా విశ్లేష‌కులు. దీంతో అభిమానులు చాలా ఖుషి అవుతున్నారు.

Also Read: Rohit Sharma ODI Ranking: 38 ఏళ్లలో నం.1 ర్యాంక్.. గంభీర్ కాదు, వాడి అమ్మ మొగుడు కూడా రోహిత్‌ ను ఆపలేడు.. 2027 వరల్డ్ కప్ లోడింగ్

ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండవ సెమీ ఫైనల్ అక్టోబర్ 30వ తేదీన అంటే ఎల్లుండి జరగనుంది. ఈ మ్యాచ్ నావి ముంబైలోని డివై పాటిల్‌ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఎప్పటిలాగే జియో హాట్ స్టార్‌ లో ఈ మ్యాచ్ లు ఫ్రీగా చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా మ్యాచ్ లు వస్తాయి.

Related News

బుమ్రా బౌలింగ్ లో ఆడ‌టం నా వ‌ల్ల కాదు..పాకిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

Liam Livingstone: ఐపీఎల్ ప‌ర‌మ బోరింగ్ లీగ్..ప‌రువు తీసిన‌ SRH ప్లేయర్‌

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

Big Stories

×