E-Paper
Advertisement

Ind W vs SL W: విశాఖలో పొగమంచు… టీమిండియా విమానం డైవర్ట్ !

Ind W vs SL W: విశాఖలో పొగమంచు… టీమిండియా విమానం డైవర్ట్ !

Ind W vs SL W: ఇటీవల మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు.. ఈనెల 21 నుండి శ్రీలంకతో ఐదు మ్యాచ్ ల టి-20 సిరీస్ కి సిద్ధమైంది. భారత మహిళల జట్టుకు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన హర్మన్ ప్రీత్ కౌర్ ఈ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. స్మృతి మందాన వైస్ కెప్టెన్ గా కొనసాగుతుంది.

Also Read: Sarfaraz Khan: CSKలోకి ఎంట్రీ.. హీరో నాని సీన్ రిపీట్.. స‌ర్ఫ‌రాజ్ పోస్ట్ వైర‌ల్

ఇక సీనియర్లతోపాటు అండర్ 19 ప్రపంచకప్ లో అదరగొట్టిన జి. కమలిని వికెట్ కీపర్ గా జట్టులోకి వచ్చింది. అలాగే బౌలర్ వైష్ణవి శర్మ కూడా ఈ సిరీస్ కి ఎంపికైంది. భారత్ – శ్రీలంక మహిళల జట్ల మధ్య మొత్తం 5 టి-20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ సిరీస్ డిసెంబర్ 21న ప్రారంభమై.. డిసెంబర్ 30న ముగుస్తుంది. విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా ఈ మ్యాచ్ లు జరగనున్నాయి.

 

విశాఖలో పొగ మంచు.. టీమిండియా విమానం డైవర్ట్:

శ్రీలంకతో 5 టి 20 మ్యాచ్ ల సిరీస్ కోసం భారత జట్టు నేడు విశాఖకు చేరుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఉమెన్స్ టి-20 జట్టు సభ్యులతో ముంబై నుంచి విశాఖకు బయలుదేరిన విమానాన్ని పూర్ విజిబులిటీ కారణంగా అధికారులు విజయవాడకు దారి మళ్ళించారు. అలాగే దేశవ్యాప్తంగా దట్టమైన పొగ మంచు కారణంగా పలు విమాన సర్వీసులకు కూడా అంతరాయానికి గురవుతున్నాయి. విశాఖ నుంచి శంషాబాద్ వెళ్లాల్సిన విమానం కూడా పొగ మంచు కారణంగా రద్దయింది. భారత్ – శ్రీలంక మధ్య మొదటి టి-20 డిసెంబర్ 21 ఆదివారం రోజున విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం విశాఖపట్నం బయలుదేరిన భారత మహిళా జట్టు ప్రస్తుతం విజయవాడ చేరుకుంది.

 

టి-20 ప్రపంచ కప్ 2026:

ఈ ఐదు మ్యాచ్ ల టి-20 సిరీస్.. టి-20 ప్రపంచ కప్ 2026 కి మొదటి సన్నాహకంగా భావిస్తున్నారు. 2024 లో జరిగిన టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత.. టీమిండియా లీగ్ దశలోనే నిష్క్రమించింది. అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ ని 2-1, ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ ని 3 – 2 తో కైవసం చేసుకుంది.

Also Read: Jasprit Bumrah: బుమ్రా ఫ్యామిలీకి ఏమైంది.. టీ20 సిరీస్ మధ్యలో ఎందుకు ముంబై వెళ్లారు?

టి-20 ప్రపంచ కప్ 2026 కి ముందు టీమిండియా – ఆస్ట్రేలియా 2026 ఫిబ్రవరిలో, 2026 మే లో ఇంగ్లాండ్ తో తలపడనుంది. అలాగే వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత మహిళల జట్టు ఆడుతున్న తొలి సిరీస్ ఇదే. ఇక భారత్ – శ్రీలంక చివరి టి-20 మ్యాచ్ అక్టోబర్ 2024లో ప్రపంచ కప్ సందర్భంగా ఆడాయి. డిసెంబర్ లో జరగాల్సిన భారత్ – బంగ్లాదేశ్ పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడిన తర్వాత.. శ్రీలంకతో ఈ ద్వైపాక్షిక సిరీస్ ని ఖరారు చేశారు.

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×