
India vs England 4th Test Records: ఇంగ్లాండ్తో రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ విజయ ఢంకా మోగించింది. 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించింది. ఓవర్ నైట్ స్కోర్ 40/0 తో నాలుగో రోజు బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు ధాటిగా ఆడారు. కాగా స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో భారత అభిమానులు టెన్షన్ పడ్డారు. కానీ గిల్, జురెల్ లాంఛనాన్ని పూర్తి చేశారు.
ఈ విజయంతో డబ్లూటీసీ(WTC) పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 64.58 విజయాల శాతంతో టీమిండియా సెకెండ్ ప్లేస్లో ఉండగా 75 శాతంతో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంది. ఇండియా తర్వాత ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వరుస స్థానాల్లో నిలిచాయి. కాగా ఇంగ్లాండ్ జట్టు 19.44 విజయ శాతంతో ఎనిమిదో స్థానానికి పడిపోయింది.
రాంచీ టెస్టు రికార్డులివే..
Read More: రాంచీ టెస్ట్ లో టీమిండియా విజయం .. సిరీస్ కైవసం..