Indian Players poor Performance in IPL After Announcement of T20 World Cup 2024 Squad: ఇంతవరకు అద్భుతంగా ఆడిన ఐపీఎల్ ఆటగాళ్లలో చాలామంది టీ 20 ప్రపంచకప్నకు ఎంపికయ్యారు. అప్పటి నుంచి వరుసగా విఫలం అవుతున్నారు. ఇది చూసి బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆందోళన చెందుతోంది. ఏట్రా బాబూ ఇలా జరిగిందని బెంబేలు పడుతోంది. మరోవైపు ప్రపంచంలోని క్రికెట్ జట్ల ముందు నవ్వుల పాలవుతోంది. ఇదే తీరుగా ఆడితే గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టడం ఖాయమని సీనియర్లు అంటున్నారు.
ఒకసారి టీ 20 ప్రపంచకప్ జట్టు ఆటగాళ్లు.. ఐపీఎల్ లో ఎలా ఆడుతున్నారో చూద్దాం.. ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మను తీసుకుంటే జట్టు ప్రకటించిన రోజునే 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అదే మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా డక్ అవుట్ అయ్యాడు. అదే జట్టులో ఉన్న సూర్య కుమార్ 16 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో బుమ్రా ఒక్కడే ఆకట్టుకున్నాడు. ఇక్కడికి నలుగురు అయిపోయారు.
ఇక తాజాగా జరిగిన హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డ్ ని యుజ్వేంద్ర చాహల్ నెలకొల్పాడు. సింగిల్ స్పెల్లో ఆరు సిక్సర్లను సమర్పించుకున్న ఘనత చాహల్కు దక్కింది. చివరికి అతని నాలుగు ఓవర్ల కోటాలో 62 పరుగులు సమర్పించుకున్నాడు. మరి ఇదే పెర్ ఫార్మెన్స్ ప్రపంచకప్ లో చేస్తే ఎలా? అని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: MI vs KKR Match Highlights: ముంబై వర్సెస్ కోల్కతా మ్యాచ్ విశేషాలు ఎన్నో.. 12 ఏళ్ల తర్వాత..!
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మొన్నటి వరకు ఇరగదీసి ఆడి, సరిగ్గా టీ 20 ప్రపంచకప్ నకు ఎంపికైన తర్వాత డక్ అవుట్ అయ్యాడు. ఇక్కడికి ఆరుగురు అయిపోయారు.
పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై ఆటగాడు శివమ్ దుబె గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. అంతేకాదు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (2) ఇలా వచ్చి అలా అవుట్ అయి వెళ్లిపోయాడు. ఇకపోతే పంజాబ్ టీమ్ లో బౌలర్ టీ ప్రపంచకప్ నకు ఎంపికైన పేసర్ అర్షదీప్ సింగ్ ఒక్క వికెట్ తీయకపోగా 4 ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకున్నాడు. ఆర్సీబీ నుంచి మహ్మద్ సిరాజ్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది.
Also Read: ఎవరి కోసం రింకూని బలి చేశారు..? ఇదో చెత్త సెలక్షన్: సీనియర్లు సీరియస్!
పర్వాలేదు, వీరిని నమ్మవచ్చు అనుకునే వారిలో యశస్వి జైశ్వాల్, జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ వీరు మాత్రమే కనిపిస్తున్నారు. అసలే విదేశీ పిచ్లు, ప్రతికూల వాతావరణం మధ్య జరిగే ఐసీసీ టీ 20 ప్రపంచకప్ను మన మొనగాళ్లకు మొనగాళ్లంతా కలిసి ఏం చేస్తారోననే ఆందోళన అప్పుడే వ్యక్తమవుతోంది.