E-Paper
Advertisement

T20 World Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం కొత్త జెర్సీ..బీజేపీపై కాంగ్రెస్ సీరియ‌స్ ?

T20 World Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం కొత్త జెర్సీ..బీజేపీపై కాంగ్రెస్ సీరియ‌స్ ?

T20 World Cup 2026: వ‌చ్చే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ( ICC Mens T20 World Cup 2026) నేప‌థ్యంలో భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి ( BCCI) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్న‌మెంట్ లో పాల్గొనే టీమిండియా జ‌ట్టు, కొత్త జెర్సీతో దిగ‌నుంద‌ట‌. ఇప్ప‌టికే చాలా జెర్సీలు మార్చిన టీమిండియా, ఇప్పుడు ఈ వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం కొత్తగా బ‌రిలోకి దిగ‌నుంద‌ట‌. ఇక ఈ కొత్త జెర్సీని రేపు లాంచ్ చేయ‌నుంద‌ట భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి. రేపు దక్షిణాఫ్రికా వ‌ర్సెస్ టీమిండియా ( South Africa vs Team India) జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే జ‌రుగుతోన్న నేప‌థ్యంలో కొత్త జెర్సీని లాంచ్ చేయ‌నున్నార‌ట‌. ఈ మేర‌కు నేష‌న‌ల్ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

Also Read: IND VS SA 1st ODI: ముచ్చెమటలు పట్టించిన దక్షిణాఫ్రికా టెయిలెండర్లు.. మొదటి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ

వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం కొత్త జెర్సీ

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Mens T20 World Cup 2026) ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రేపు టీమిండియా కొత్త జెర్సీని ( Indian team jersey) లాంచ్ చేయబోతున్నారట. రాయ్ పూర్ వేదికగా జెర్సీని లాంచ్ చేసే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. అయితే రేపు జెర్సీ రిలీజ్ కానున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. జెర్సీ బ్లూ కలర్ లో ఉంటుందని కొంతమంది పోస్టులు పెడుతుంటే, లేదు ఆరెంజ్ కలర్ లో ఉంటుందని మరికొంతమంది వాదిస్తున్నారు. మరి కొంతమంది కాషాయం రంగులో ఉన్న టీమిండియా జెర్సీని సోషల్ మీడియాలో పెడుతున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు ( Congress) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీపై కాంగ్రెస్ సీరియ‌స్ ?

రేపు టీమిండియా జెర్సీ లాంచ్ చేస్తున్న నేపథ్యంలో కాషాయ రంగు ఉన్న జెర్సీలను కొంతమంది వైరల్ చేస్తున్నారు. కాషాయం అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన గుర్తు. బిజెపి జెండా రంగులో ఉన్న జెర్సీలను కొంతమంది కావాలని వైరల్ చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఆక్టివ్ అయింది. భారతీయ జనతా పార్టీపై పోరాటానికి సిద్ధమైంది. మోడీ ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడుతోంది కాంగ్రెస్.

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత, బీసీసీఐలో బిజెపికి సంబంధించిన వాళ్లు మాత్రమే ఉంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. జై షా నుంచి మొదలుకొని గౌతమ్ గంభీర్ వరకు అందరూ భారతీయ జనతా పార్టీ వారే ఉన్నారని మండిపడుతోంది. ఇక ఇప్పుడు కాషాయ రంగు ఉన్న జెర్సీలను తీసుకువచ్చేందుకు భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఆ జెర్సీలను తగలబెడతామని వార్నింగ్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

Also Read:  Rohit Sharma: కోహ్లీ సెంచ‌రీ..గంభీర్ ను బండ బూతులు తిట్టిన రోహిత్‌…”తెరీ మా***” అంటూ

 

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×