RCB vs PBKS : ఐపీఎల్ 2025 (IPL2025) సీజన్ లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు ప్లే ఆప్స్ కి అర్హత సాధించాయి. వీటిలో క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడనున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్ లో మాత్రం గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడుతాయి. రేపు జరగబోయే మ్యాచ్ లో మాత్రం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు రెండు క్వాలిఫయర్ 1 లో తలపడుతున్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది గెలుస్తుందో చిలుక జోస్యం ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : Rishabh Pant : రిషబ్ పంత్కు భారీ జరిమానా విధించిన BCCI
రామ్మా చిలుకమ్మ.. అంటూ ఓ జ్యోతిష్యుడు బోన్ లో ఉన్న చిలుకను పంపించాడు. అప్పుడు ఆ చిలుక వచ్చి ఓ బొమ్మను తీయగా.. అందులో బెంగళూరు టీమ్ ఉంది. చిలుకమ్మా చెప్పింది.. బెంగళూరు గెలుస్తుందని జ్యోతిష్యుడు చెబుతాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు బెంగళూరు ఓడిపోతుందని కొందరూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరూ బెంగళూరు విజయం సాధిస్తుందని పేర్కొంటున్నారు. ఎవ్వరికీ తోచిన విధంగా వారు రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే.. ఇక లీగ్ దశలో ఈ ఇద్దరి మధ్య కాస్త గొడవ లాగా అయింది. అయితే ఈ మ్యాచ్ ని విరాట్ కోహ్లీ గెలిపించాడు. ఇప్పుడు అయ్యర్ రివేంజ్ తీర్చుకుంటాడా అని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇటీవలే లీగ్ దశలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విజృంభించాడు. రేపు జరుగబోయే క్వాలిఫైయర్ మ్యాచ్ లో పంజాబ్ జట్టు ఆర్సీబీ పై రివేంజ్ తీసుకుంటుందని అభిమానులు పేర్కొంటున్నారు.
Also Read : India beat Pakistan : ఓడినా సిగ్గు లేదుగా.. పాకిస్థాన్ కు ఎందుకు ఇంత బలుపు
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు కంటే కూడా పంజాబ్ కింగ్స్(PBKS) జట్టు కి విజయ అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకు కారణం ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యరే. ఇప్పటికే శ్రేయస్ కెప్టెన్సీ సమయంలో ఢిల్లీ జట్టును ఫైనల్ కి చేర్చాడు. గత ఏడాది కోల్ కతా నైట్ రైడర్స్ కి కెప్టెన్ గా ఉన్న శ్రేయాస్ అయ్యర్ టైటిల్ ని అందించాడు. ఈ సారి కూడా పంజాబ్ ని పైనల్ కి చేర్చి టైటిల్ అందించాలనే ేన.కసితో ఉన్నాడు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించని పంజాబ్ జట్టు.. ఈ సీజన్ లో టైటిల్ సాధించాలని పలువురు క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే బెంగళూరు కూడా టైటిల్ వేటలో ముందంజలో ఉంది. ఎక్కువగా పంజాబ్ కింగ్స్, బెంగళూరు జట్లు మాత్రమే టైటిల్ సాధిస్తాయని కొందరూ పేర్కొంటే.. ముంబై ఫైనల్ కి వస్తే.. కచ్చితంగా విజయం సాధిస్తుందని మరికొందరూ పేర్కొంటున్నారు. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరీ.
?igsh=MXM5a2NxbXExa3l6dA==