IPL 2026 Finals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) దాదాపు రెండు నెలలపాటు ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ క్రమంలో ఆదివారం రోజున గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final) మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా బిగ్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించారు. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విక్టరీ సాధించింది. దీంతో వరుసగా రెండోసారి టైటిల్ నెగ్గిన జట్టుగా చరిత్ర సృష్టించింది బెంగుళూరు. ఈ మ్యాచ్ లో 156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ విధించింది. ఇక ఈ లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి చేదించింది బెంగళూరు. విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసిన నేపథ్యంలో, ఛాంపియన్ గా నిలిచింది బెంగుళూరు.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్స్ జరిగింది. అయితే ఇందులో గుజరాత్ టైటాన్స్ మొదటి బ్యాటింగ్ చేసి 155 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. కానీ చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli) మాత్రం చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. 42 బంతుల్లో 75 పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇందులో మూడు సిక్సర్లు అలాగే తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. 178 స్ట్రైక్ రేట్ సాధించిన విరాట్ కోహ్లీ… సిక్సర్ కొట్టి బెంగుళూరు జట్టుకు రెండో టైటిల్ అందించాడు. దీంతో దేశవ్యాప్తంగా బెంగళూరు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అటు ఓడిపోయిన గుజరాత్ టైటాన్స్ తీవ్ర నిరాశకు గురైంది. ఇది ఇలా ఉండగా ఫైనల్స్ లో భారీ స్కోర్ నమోదు కాకపోవడంతో… మ్యాచ్ చెప్పగా సాగిందని విమర్శలు కూడా వస్తున్నాయి. దానికి తోడు విరాట్ కోహ్లీ చివరి వరకు ఉన్న నేపథ్యంలో.. జిడ్డు బ్యాటింగ్ అంటూ కొంతమంది ట్రోలింగ్ కూడా చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ముగిసింది. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రైజ్ మనీ (IPL 2026 Prize Money) వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ టోర్నమెంట్ విజేతగా నిలిచిన జట్టుకు 20 కోట్లు దక్కనున్నాయి. ఇక ఫైనల్స్ లో ఓటమిపాలై… రన్నరప్ గా నిలిచిన జట్టుకు 13 కోట్లు దక్కనున్నాయి. అదే సమయంలో క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఏడు కోట్లు దక్కుతాయి. అటు ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 6.5 కోట్లు దక్కబోతున్నాయి. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్న వైభవ్ సూర్యవంశీకి ఏకంగా 10 లక్షలు దక్కనున్నాయి.