IPL 2026 Finals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఫైనల్స్ మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్స్ 7:30 గంటలకే ప్రారంభమైంది. అయితే ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్… నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులు మాత్రమే సాధించగలిగింది. సాయి సుదర్శన్ అలాగే కెప్టెన్ గిల్ అత్యంత దారుణంగా విఫలమయ్యారు. దీంతో తక్కువ స్కోరు మాత్రమే నమోదు చేయగలిగింది గుజరాత్ టైటాన్స్. ఇక ఈ మ్యాచ్ లో 156 పరుగులు సాధిస్తే, ఆర్సీబీ ఛాంపియన్ కానుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ నెగ్గింది. ఈ క్రమంలోనే బెంగళూరు మొదట బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసి బొక్క బోర్లా పడింది. ఈ టోర్నమెంటులో గుజరాత్ టైటాన్స్ జట్టుకు 1000 ఏనుగుల బలంలా ఉన్న సాయి సుదర్శన్ అదే సమయంలో కెప్టెన్ గిల్ ఇద్దరు కూడా చేతులెత్తేశారు. 12 పరుగుల వద్ద సాయి సుదర్శన్ వికెట్ సమర్పించుకుంటే.. కెప్టెన్ గిల్ 10 పరుగులకు అవుట్ అయ్యాడు.
ఇక్కడే గుజరాత్ టైటాన్స్ మొత్తం డీలా పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన బట్లర్ అయిన ఆదుకుంటాడని అందరూ అనుకున్నారు. అతగాడు కూడా చేసేదేమీ లేదన్నట్లుగా వ్యవహరించాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్ లో అనవసరపు షాట్ కు వెళ్లి వికెట్ సమర్పించుకున్నాడు. స్టంట్ అవుట్ అయి, వెనుతిరిగాడు. అయితే సుందర్ మాత్రం 37 వంతుల 50 పరుగులు చేసి గుజరాత్ పరువు కాపాడాడు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు సాధిస్తేనే, గుజరాత్ ఓడిపోయి బెంగళూరు గెలుస్తుంది. ఇదే జరిగితే రెండోసారి రజత్ పటిదార్ సేన చాంపియన్ అవుతుంది.
గుజరాత్ తో జరిగిన ఈ ఫైనల్స్ మ్యాచ్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అందరూ అద్భుతంగా రాణించారు. భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీయగా… జోష్ హెజెల్ వుడ్ కూడా మరో రెండు వికెట్లు తీశారు. ముఖ్యంగా రసిక్ మూడు వికెట్లు పడగొట్టి గుజరాత్ జట్టును దెబ్బతీశాడు. కృనాల్ పాండ్యా కూడా ఓ వికెట్ పడగొట్టి శభాష్ అనిపించాడు. ఇది ఇలా ఉండగా గ్రూప్ స్టేజిలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య 42వ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కూడా రాయల్ చాలెంజెస్ బెంగళూరు 155 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ సులభంగా చేదించింది. కానీ ఇప్పుడు గుజరాత్ 155 పరుగులు సాధిస్తే… బెంగళూరు చేదించనుంది. మరి ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి.