IPL Auction 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలం ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో భారత లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ బంపర్ ఆఫర్ కదిలింది. వేలంలోకి రవి బిష్ణోయ్ పేరు రాగానే చాలా టీంలు అలర్ట్ అయ్యాయి. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న కావ్య పాప కూడా రవి బిష్ణోయ్ ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించింది. అయితే చివరకు రవి బిష్ణోయ్ ని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. రెండు కోట్ల బేస్ ధరతో వేలంలోకి వచ్చిన రవి బిష్ణోయ్ ని 7.2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఉన్న రవీంద్ర జడేజాకు రవి బిష్ణోయ్ తోడు కానున్నాడు. ఇద్దరు స్పిన్నర్లు ప్రత్యర్థిని వేటాడనున్నారు.
Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్కడ చూడాలంటే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ వేలం సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప ఉలుకు లేదు పలుకు లేదు. ఎంతమంది ప్లేయర్లు వచ్చినా కొనేందుకు ముందుకు వెళ్లడం లేదు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దగ్గర 25.50 కోట్లు ఉన్నాయి. ఆ జట్టుకు మొత్తం 12 మంది ప్లేయర్లు కావాలి. ఇందులో స్వదేశీ పదిమంది ప్లేయర్లు కాగా విదేశాలకు చెందిన ఇద్దరిని కొనుగోలు చేయాల్సి ఉంది. దాదాపు వేలం సగం పూర్తయింది.
అయినప్పటికీ ఒక్క ప్లేయర్ ను కూడా కొనుగోలు చేయలేదు. హైదరాబాద్. అయితే స్పిన్నర్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. రవి బిష్ణోయ్ ఈ కోసం కాస్త ప్రయత్నించి వదిలేశారు. దీంతో కావ్య పాప పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. వేలంలోకి వెళ్లిన కావ్య పాప నిద్రపోయినట్లు ఉందని సెటైర్లు పేల్చుతున్నారు. ఇకనైనా నిద్రలేచి ఎవరినైనా కొనుగోలు చేయండి అంటూ చురకలు అంటిస్తున్నారు.
Eshan Malinga and Kamindu wasted spots
— ali mohammed (@albie2009) December 15, 2025