Irfan Pathan On Gambhir and Gill: టీమిండియా వర్సెస్ శ్రీలంక (Sri Lanka vs India) మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్ ( India tour of Sri Lanka 2026 ) ఇవాల్టితో ముగిసింది. మొదటి టెస్ట్ లో విజయం సాధించిన టీమిండియా… రెండు టెస్టులో శ్రీలంక టేయిలండర్స్ ను పెవిలియన్ కు త్వరగా పంపడంలో విఫలమై మ్యాచ్ చేజేతులా పోగొట్టుకుంది. దీంతో ఈ రెండు టెస్టుల సిరీస్ ను 1-0 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. టీమిండియా ఈ సిరీస్ గెలిచినప్పటికీ…. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ( WTC Final) మ్యాచ్ ఛాన్స్ దక్కించుకోవడం మరింత కఠిన తరమైంది. అయితే, రెండు టెస్ట్ డ్రా కావడానికి కారణం గంభీర్, గిల్ ఇద్దరూ కారణం అంటూ ఇర్ఫాన్ పఠాన్ సీరియస్ అయ్యారు.
టీమ్ ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మొన్న ఆగస్టు 23వ తేదీన రెండు టెస్ట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇందులో అద్భుతంగా టీమిండియా రాణించగా… ఐదవ రోజు మాత్రం మన బౌలర్లు చేతులెత్తేశారు. దీంతో మ్యాచ్ డ్రా అయింది. ఈ మ్యాచ్ డ్రా కావడంపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చాలా సీరియస్ అయ్యారు. గౌతమ్ గంభీర్, కెప్టెన్ గిల్ చెత్త నిర్ణయాల వల్ల మ్యాచ్ డ్రా అయిందని ఫైర్ అయ్యారు. శ్రీలంకను ఫాలో ఆన్ ఆడించకుండా… టీమిండియా బ్యాటింగ్ చేసి ఉంటే కచ్చితంగా మ్యాచ్ గెలిచేవారని కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు.. అయితే ఫాలో ఆన్ ఆడించడంతో… బౌలర్లు తమ రిథమ్ కోల్పోయారని వివరించారు.
వరుసగా బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిన నేపథ్యంలో టీమిండియా బౌలర్లు విసిగిపోయారని ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశారు. రెస్టు లేకుండా టీమిండియా బౌలర్లు బంతులు సంధించిన క్రమంలో… శ్రీలంక జట్టుకు అడ్వాంటేజ్ జరిగిందన్నారు. అందుకే ఐదవ రోజు శ్రీలంక బ్యాటర్లు అద్భుతంగా రానించి… మ్యాచ్ డ్రా చేసుకున్నారని పేర్కొన్నారు. గౌతమ్ గంభీర్ అలాగే గిల్ తొందరపాటు నిర్ణయం తీసుకుని, అనవసరంగా ఫాలో-వన్ ఆడించి… టీమిండియా గెలవకుండా చేశారని ఆగ్రహించారు. ఈ దెబ్బకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో టీమిండియా ఛాన్స్ లు మరింత జటిలం అయ్యాయని ఆగ్రహించారు. కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో ఛాన్స్ దక్కాలంటే టీమిండియా తన తర్వాతి ఏడు మ్యాచ్ లలో ఏడు గెలవాలి. న్యూజిలాండ్ పై రెండు, ఆస్ట్రేలియాపై ఐదు మ్యాచ్ లు గెలవాలి.