Irfan Pathan reaction On Mohsin Naqvi and Rajiv Shukla: ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (Asian Cricket Council) సమావేశంలో బీసీసీ ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా (Rajiv Shukla), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) పక్క పక్కన కూర్చుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.. పాకిస్తాన్ వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని కండిషన్స్ పెట్టిన బీసీసీఐ.. ఇప్పుడు మొహ్సిన్ నఖ్వీ పక్కన కూర్చోవడంపై సమాధానం ఏం చెబుతుందని నిలదీస్తున్నారు. రాజీవ్ శుక్లాకు కొంచెం కూడా బుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మొహ్సిన్ నఖ్వీ పక్కన రాజీవ్ శుక్లా కూర్చోవడంపై ఇర్ఫాన్ పఠాన్ సీరియస్ అయ్యారు. గజ దొంగ నఖ్వీ పక్కన కూర్చోడానికి సిగ్గులేదా ? అంటూ శుక్లా పరువు తీశారు ఇర్ఫాన్ పఠాన్.
2025లో ఆసియా కప్ టోర్నమెంట్ దుబాయ్ వేదికగా జరిగింది. ఈ టోర్నమెంట్ లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ లు జరిగాయి. ఫైనల్స్ లో కూడా టీమిండియాతో పాకిస్తాన్ తలపడింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా విక్టరీ సాధించింది. దీంతో ఆసియా కప్ 2025 ట్రోఫీ దక్కించుకుంది. కానీ పహల్గామ్ సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని ముందే బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఈ టోర్నమెంటు నుంచి పాకిస్తాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఇండియన్స్. అదే సమయంలో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ 2025 ట్రోఫీని సూర్య కుమార్ యాదవ్ తీసుకోలేదు. టీమిండియా ప్లేయర్లు ట్రోఫీని తీసుకోలేదన్న కుట్రతో… దాన్ని తన ఆఫీసులోనే పెట్టుకున్నాడు ఉన్న క్వి. దాదాపు రెండు సంవత్సరాలు గడిచినా కూడా ఆ ట్రోఫీని మాత్రం ఇవ్వలేదు. అందుకే ఆ ట్రోఫీ గురించి టీమిండియా పోరాటం చేస్తోంది.
ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ వార్షిక సమావేశం సందర్భంగా మొహ్సిన్ నఖ్వీ పక్కన కూర్చున్న రాజీవ్ శుక్లాను ఉద్దేశించి ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ వాడి పక్కన కూర్చొని ఎంజాయ్ చేశావు… కాఫీలు, బిర్యానీలు తిన్నావు… కానీ ఆసియా కప్ ట్రోఫీ ఎందుకు నిలదీయలేక పోయావ్ ? అంటూ ప్రశ్నించారు. పక్కన కూర్చున్నప్పుడే మా ట్రోఫీ ఏది అంటూ నిలదీస్తే వాడి పరువు పోయేది కదా అంటూ ప్రశ్నించారు. ఆసియా కప్ ఇవ్వనందుకు..నఖ్వీ కాలర్ పట్టుకుని నిలదీయాల్సిందన్నారు. అలా చేయకుండా పాకిస్తాన్ వాడితో ఎంజాయ్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ అంటూ ఫైర్ అయ్యారు. బిసిసిఐ వైస్ ప్రెసిడెంట్ పదవికి సరైన న్యాయం రాజీవ్ శుక్లా చేయలేదని విమర్శించారు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.