E-Paper
Advertisement

దేశంలో ఫస్ట్ హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ రెడీ.. వందే భారత్‌కు మించి వేగంతో దూసుకెళ్లనున్న రైళ్లు!

దేశంలో ఫస్ట్ హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ రెడీ.. వందే భారత్‌కు మించి వేగంతో దూసుకెళ్లనున్న రైళ్లు!
Advertisement

Indian Railways High Speed Test Track: భారతీయ రైల్వేలో హై స్పీడ్ రైళ్లకు సంబంధించిన పరీక్షలు మరింత స్పీడప్ కానున్నాయి. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేకంగా నిర్మిస్తున్న హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ ట్రాక్ అందుబాటులోకి వస్తే గంటకు 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లను పరీక్షించే అవకాశం ఉంటుంది. కొత్త రైళ్లు, రైల్వే పరికరాలు, ఆధునిక సాంకేతికతను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ఈ ట్రాక్ ఉపయోగపడనుంది.

రూ.967 కోట్లతో ప్రత్యేక ట్రాక్

ఈ హైస్పీడ్ టెస్ట్ ట్రాక్‌ను రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.967.07 కోట్లను ఖర్చు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని నవా ప్రాంతంలో ఈ ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జైపూర్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో, జోధ్‌పూర్ డివిజన్ పరిధిలోని గూఢ, తాతన మిథ్రి ప్రాంతాల మధ్య ఈ ట్రాక్ నిర్మిస్తున్నారు. ఇది నార్త్ వెస్టర్న్ రైల్వే పరిధిలో ఉంది.

Advertisement

సాధారణ రైల్వే ట్రాక్‌పై రైళ్లను పరీక్షించడానికి చాలా పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా కొత్త డిజైన్లు, అధిక వేగంతో నడిచే రైళ్లు, కొత్త పరికరాలను పూర్తి స్థాయిలో పరీక్షించడానికి ప్రత్యేకమైన సదుపాయాలు అవసరం. ఈ నేపథ్యంలో హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ కీలకంగా మారనుంది. ఇక్కడ రైళ్లను గంటకు 220 కిలోమీటర్ల వేగం వరకు నడిపి వాటి పనితీరును పరిశీలించే అవకాశం ఉంటుంది. అధిక వేగంలో రైలు స్థిరత్వం, భద్రత, ట్రాక్ పనితీరు లాంటి అంశాలను పరీక్షించేందుకు ఈ ట్రాక్ ఉపయోగపడుతుంది.

కొత్త రైళ్లకు పరీక్షా కేంద్రంగా..

దేశంలో తయారయ్యే కొత్త రైళ్లతో పాటు విదేశాల్లో తయారైన రైళ్లను కూడా ఇక్కడ పరీక్షించే అవకాశం ఉంటుంది. రైల్వేకు సంబంధించిన వివిధ పరికరాలు, కొత్త సాంకేతికతలను ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి కూడా ఈ ట్రాక్ ఉపయోగపడుతుంది.

Advertisement

ప్రస్తుతం భారతీయ రైల్వే వేగవంతమైన రైళ్లతో పాటు ఆధునిక సాంకేతికతపై దృష్టి పెడుతోంది. వందే భారత్ వంటి సెమీ హైస్పీడ్ రైళ్ల నుంచి భవిష్యత్తులో మరింత వేగంగా ప్రయాణించే రైళ్ల వరకు అనేక ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రత్యేక హై స్పీడ్ టెస్ట్ ట్రాక్ ఉండటం వల్ల కొత్త రైళ్లను పరీక్షించేందుకు ఇతర సాధారణ రైల్వే మార్గాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. దీంతో ప్రయోగాలు, పరీక్షలు వేగంగా నిర్వహించే అవకాశం ఉంటుంది.

2027-28 నుంచి కీలక పరీక్షలు

ఈ హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తి కావడానికి చివరి దశలో ఉంది. 2027-28 నాటికి ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజస్థాన్‌లో నిర్మిస్తున్న ఈ హై స్పీడ్ టెస్ట్ ట్రాక్ భారతీయ రైల్వేలో ముఖ్యమైన మౌలిక సదుపాయంగా మారనుంది. భవిష్యత్తులో వేగవంతమైన రైళ్లను అభివృద్ధి చేయడంతో పాటు కొత్త రైల్వే టెక్నాలజీని సురక్షితంగా పరీక్షించేందుకు ఇది ఉపయోగపడనుంది.

Read Also: అమృత్ భారత్ రైళ్లలో సూపర్ స్పెసిలిటీస్.. వెర్షన్ 3.0 చూస్తే మతిపోవాల్సిందే!

Tags

Related News

సముద్రంలో ఈ పసుపు గుర్తు కనిపిస్తే జాగ్రత్త! ఎందుకో తెలుసా?

మహారాష్ట్రలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ తప్పనిసరి ఎందుకు చేశారు? కారణాలేంటీ?

బ్రిటీషర్ల నాటి వైభవం.. మన దేశంలోనూ ‘లండన్’ ఉందోచ్.. విశేషాలు ఇవే!

మెట్రో రైలుకు గ్లోబల్ గుర్తింపు, ఆ సర్టిఫికేషన్ సాధించిన తొలి సంస్థగా..

అమృత్ భారత్ రైళ్లలో సూపర్ స్పెసిలిటీస్.. వెర్షన్ 3.0 చూస్తే మతిపోవాల్సిందే!

రాఖీ పండుగ వేళ రైల్వే గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్ వచ్చేస్తున్నాయ్!

రైల్వే బెడ్‌ షీట్లు కొట్టేసి.. శాలువాలుగా కప్పుకొని.. నెట్టింట వీడియో వైరల్!

Big Stories

Advertisement
×