E-Paper
Advertisement

Jasprit Bumrah: కమిన్స్‌ కు బిగ్‌ షాక్‌.. బుమ్రాకు మరో అవార్డు !

Jasprit Bumrah: కమిన్స్‌ కు బిగ్‌ షాక్‌.. బుమ్రాకు మరో అవార్డు !
Advertisement

Jasprit Bumrah: భారత సూపర్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2022 – 23 సంవత్సరాలలో కఠినమైన కాలాన్ని ఎదుర్కొన్నాడు. బుమ్రాని నిరంతర గాయాలు వెంటాడాయి. అయితే గాయం నుండి తిరిగి వచ్చినప్పటినుండి బుమ్రా పూర్తిగా భిన్నమైన స్థాయిలో అతని ప్రదర్శనని కొనసాగిస్తున్నాడు. తాజాగా ముగిసిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన బుమ్రా {Jasprit Bumrah} 2024 డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికయ్యాడు.

Also Read: Klaasen Six: క్లాసెన్ కొట్టిన భారీ సిక్స్.. బంతిని ఎత్తుకెళ్లిన అభిమాని.. వీడియో వైరల్!

Advertisement

తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) డిసెంబర్ నెలకు గాను మంగళవారం ప్రకటించిన ఫలితాలలో పురుషుల విభాగంలో బుమ్రా {Jasprit Bumrah} ఈ అవార్డుని గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ని వెనక్కి నెట్టి బుమ్రా.. బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అందుకున్నాడు. డిసెంబర్ లో ఆస్ట్రేలియా పై మూడు టెస్టుల్లో 14.22 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. నాలుగో టెస్ట్, ఐదో టెస్టుల్లో మరో 10 వికెట్లు తీశాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో బుమ్రా మొత్తం 32 వికెట్లు పడగొట్టాడు. కానీ మరోసారి గాయం కారణంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్ట్ కి అతడు {Jasprit Bumrah} బౌలింగ్ చేయలేదు. మొత్తంగా తొమ్మిది ఇన్నింగ్స్ లలో 32 వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికయ్యాడు. అంతేకాదు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని ఐదు టెస్టుల సిరీస్ లో బుమ్రా 200 టెస్ట్ వికెట్లు కూడా పూర్తి చేశాడు.

Advertisement

బంతుల పరంగా ఈ మైలురాయిని చేరుకున్న నాలుగవ ఫాస్ట్ బౌలర్ గా {Jasprit Bumrah} బుమ్రా నిలిచాడు. తన కెరీర్ లో 44వ టెస్ట్ ఆడిన బుమ్రా కేవలం 8484 బంతుల్లోనే 200 వికెట్ల మార్క్ ని అందుకున్నాడు. ఈ లిస్టులో పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ 7,725 బంతులలో 200 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు.

Also Read: Olympic Medal Rust: తుప్పు పట్టిన ఒలింపిక్స్ పతకాలు.. అథ్లెట్లకు అదిరిపోయే న్యూస్‌ !

అలాగే 20 కంటే తక్కువ సగటుతో 200 టెస్ట్ వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా నిలిచాడు {Jasprit Bumrah} బుమ్రా. ఇక మహిళల క్రికెట్ లో ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్ల్యాండ్ ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకుంది. భారత్, న్యూజిలాండ్ లతో జరిగిన సిరీస్ లలో అద్భుత ప్రదర్శన చేసింది అన్నాబెల్ సదర్ల్యాండ్. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకుంది.

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×