Joginder Sharma On MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై (MS Dhoni) జోగిందర్ శర్మ (Joginder Sharma ) షాకింగ్ కామెంట్స్ చేశారు. 2007 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ (2007 T20 World Cup Final) సందర్భంగా తనకు బౌలింగ్ ఇచ్చి… MS ధోని పెను సంచలనానికి తెర లేపాడని వ్యాఖ్యానించారు. నేను వేయలేను బాబు ? అని మొత్తుకున్నా కూడా… ధోని తన మాట వినలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బలవంతంగా తనతో బౌలింగ్ చేయించి.. రిజల్ట్ తీసుకువచ్చాడని గుర్తు చేశారు జోగిందర్ శర్మ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జోగిందర్ శర్మ.. టి20 ప్రపంచ కప్ 2007 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన విషయాలను పంచుకున్నారు.
2007 టీ20 ప్రపంచ కప్ సమయంలో ధోని కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఫైనల్స్ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగింది. అయితే ఇందులో చివరి ఓవర్ జోగిందర్ శర్మ వేయగా… మిస్బా ఉల్ హక్ ఇచ్చిన అద్భుతమైన క్యాచ్ ను వెనకాల ఉన్న శ్రీశాంత్ పట్టుకున్నాడు. దీంతో టీం ఇండియా ఛాంపియన్ గా నిలిచింది. ఈ క్రమంలో అప్పటి మ్యాచ్ గురించి జోగిందర్ శర్మ కీలక విషయాలను పంచుకున్నారు. 2007 ప్రపంచ కప్ ఫైనల్లో చివరి ఓవర్ హార్భజన్ సింగ్ వేస్తాడని అందరూ అనుకున్నారని జోగిందర్ శర్మ తెలిపారు. అతడికి ఒక ఓవర్ మిగిలి ఉన్నప్పటికీ… పెద్దగా అనుభవం లేని తనకు మహేంద్ర సింగ్ ధోని బౌలింగ్ ఇచ్చాడని గుర్తు చేశారు. ఆ సమయంలో తాను భయపడిపోయానని వ్యాఖ్యానించారు.
నువ్వు బౌలింగ్ చెయ్… గెలుపు ఓటముల గురించి అస్సలు ఆలోచించకు… ఓడిపోతే బాధ్యత నేను తీసుకుంటాను.. గెలిస్తే క్రెడిట్ నీకు ఇస్తాను అని ధోని తనకు భరోసా కల్పించాడని వివరించారు జోగిందర్ శర్మ. ఈ క్రమంలో తనకు ఆత్మవిశ్వాసం పెరిగిందని తెలిపారు. అలా అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాలని జోగిందర్ శర్మ వ్యాఖ్యానించారు. కాగా చివరి ఓవర్ లో 13 పరుగులు పాకిస్తాన్ కు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రమాదకరంగా మారిన మిస్బా స్ట్రైకింగ్ లో ఉన్నాడు. అప్పటికే జోగిందర్ వేసిన రెండో బంతిని సిక్సర్ గా కూడా మలిచాడు. అయినప్పటికీ ఒత్తిడిని ఫేస్ చేస్తూ అద్భుతమైన బంతి సంధించాడు జోగిందర్ శర్మ (Joginder Sharma). అయితే ఆ సమయంలో మూడో బంతిని స్కూప్ షాట్ ఆడబోయి మిస్బా (Misbah-ul-Haq) క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో మొట్ట మొదటి టి20 ప్రపంచ కప్ టీమ్ ఇండియా వశం అయింది.