Nepal Floods: ఇది ఒక్క నేపాల్ విషాదం మాత్రమే అనుకుంటే పొరపాటు. త్రిశూలి, నారాయణి అయ్యి, భారత్లోకి గండక్ నదిగా వస్తుంది. అందుకే బిహార్ వెంటనే అలర్ట్ ప్రకటించి, వాల్మీకినగర్ బ్యారేజ్ 36 గేట్లూ తెరిచింది. అదృష్టవశాత్తు ముప్పు తగ్గింది. కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్లిన కొంతమంది యాత్రికుల జాడ తెలియడంలేదు. మరోవైపు ఇంతకముందు నేపాల్ మనకు కరెంట అమ్మేది; ఇప్పుడు దాని సొంత ఉత్పత్తిలో 8 శాతం పోయింది. ఇప్పుడు నేపాలే భారత్ నుంచి కరెంటు కొనాల్సి రావచ్చు.
ఇప్పుడు అందరి భయం ఒక్కటే మళ్లీ వరద వస్తుందా ? కొండ కూలిన చోట, ఆ శిథిలాలే ఒక కొత్త అడ్డుకట్టగా మారి, వెనక ఇరవై లక్షల ఘనపు మీటర్లు నీరు నిలిచింది దీన్ని barrier lake అంటారు. ఇది పగిలితే మళ్లీ కిందకి వరద వస్తుంది. చైనా చెబుతోంది ఏంటంటే నీటి మట్టం పది మీటర్లు తగ్గింది, పరిస్థితి అదుపులో ఉంది అని. కానీ భోటే కోషి ప్రవాహం మళ్లీ కొంచెం పెరిగిందని నేపాల్ అధికారులు హెచ్చరించారు. రెస్క్యూ టీమ్స్ అప్రమత్తంగా ఉన్నాయి. అంటే ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.
Also read: నీట్-పీజీ ఏఐక్యూ కలకలం.. 50% నుంచి 15%కి తగ్గించాల్సిందే.. కేంద్రానికి వినోద్ కుమార్ లేఖ!
ఇది ఒక్కసారి జరిగిన ప్రమాదం కాదు. ఒక pattern. 2013లో కేదార్నాథ్. 2021లో ఉత్తరాఖండ్ చమోలీ — అచ్చం ఇలాగే, –మంచు ముక్క కూలి, రెండు వందల మందికి పైగా చనిపోయి, రెండ జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. 2023లో సిక్కిం. 2024లో థామే. పోయిన ఏడాది ధరాలి, రసువాగడి. ఇప్పుడు మళ్లీ రసువా. హిమాలయాల్లో 4 వేల మీటర్లు పైన, ప్రపంచ సగటు కంటే ఆల్మోస్ట్ ఐదు రెట్లు వేగంగా వేడెక్కుతోంది. మంచు కరుగుతోంది. కొండలు వదులవుతున్నాయి. ఇలాంటివి ఇంకా జరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Also read: నఖ్వీ దద్దమ్మ అనుకున్నా, కానీ ఇమ్రాన్ ఖాన్ వివాదంలో వాడికి దండేసి దండం పెట్టాల్సిందే