E-Paper
Advertisement

Cricket for a Cause: కోహ్లీ జెర్సీ రూ. 40 లక్షలు, రోహిత్ బ్యాట్ రూ.24 లక్షలు

Cricket for a Cause: కోహ్లీ జెర్సీ రూ. 40 లక్షలు, రోహిత్ బ్యాట్ రూ.24 లక్షలు
Advertisement

Cricket for a Cause fund Rising Auction: టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ సేవాభావం ఇప్పుడు నెట్టింట పెద్ద వైరల్ అయ్యింది. ఎందుకంటే భార్య అతియా శెట్టితో కలిసి వినికిడి, దృష్టి లోపంతో బాధపడుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ‘క్రికెట్ ఫర్ ఎ కాజ్’ అనే ఫండ్ రైజింగ్ కార్యక్రమం ప్రారంభించారు.

ఇందులో ప్రముఖ క్రికెటర్ల దుస్తులు, బ్యాట్ లు వేలం పాట వేశారు. అయితే ఇక్కడ అందరికన్నా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ వస్తువులే అధిక ధరలు పలికాయి. అందులో ముఖ్యంగా తన జెర్సీని వేలం వేస్తే.. రూ. 40 లక్షలు, గ్లోవ్స్ రూ. 28 లక్షలు పలికాయి. రోహిత్ బ్యాట్ రూ. 24 లక్షలు, ధోనీ బ్యాట్ రూ. 13 లక్షలు, ద్రవిడ్ బ్యాట్ రూ. 11 లక్షలు, రాహుల్ జెర్సీ రూ. 11 లక్షలు పలికాయి.

Advertisement

ఈ కార్యక్రమం ద్వారా రాహుల్-అతియా దంపతులు మొత్తం రూ.1.93 కోట్లు సేకరించారు. ఈ మొత్తాన్ని విప్లా ఫౌండేషన్‌కు అందించనున్నారు. ఈ ఫౌండేషన్ ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో దివ్యాంగ విద్యార్థుల కోసం ఒక స్కూల్‌ను నడుపుతోంది. వారికోసం ఈ నిధిని అందించనున్నారు.

Also Read: నువ్వొస్తానంటే.. మేం వద్దంటామా?: రోహిత్ కోసం ఫ్రాంచైజీల క్యూ!

Advertisement

ఈ సందర్భంగా అతియా శెట్టి మాట్లాడుతూ.. ఈ ఫౌండేషన్‌తో తనకు చిన్నప్పటి నుంచి ఎంతో అనుబంధం ఉందని తెలిపింది. ఇక్కడి పిల్లలకు పాఠాలు బోధించడం, వారితో సమయం గడపడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చేదని గుర్తు చేసుకుంది. తన నానమ్మ ప్రారంభించిన ఈ ఫౌండేషన్‌కు మద్దతుగా ఉండాలనేది తన అభిమతమని తెలిపింది.

రాహుల్-అతియా దంపతులు ఒక సదుద్దేశంతో చేపట్టిన ఈ పనికి ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్, సంజు శాంసన్ వంటి స్టార్ క్రికెటర్లు మద్దతు తెలిపారు.

వీరే కాకుండా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ క్వింటన్ డి కాక్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు కూడా మద్దతుగా నిలిచారు.

Related News

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

Big Stories

Advertisement
×