Ahmed Shehzad: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Mens T20 World Cup 2026) దగ్గర పడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇండియాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అభిషేక్ శర్మను ( Abhishek Sharma ) టార్గెట్ చేసి అహ్మద్ షెజాద్ సంచలన ప్రకటన చేశాడు. అభిషేక్ శర్మ పిల్ల బచ్చాగాడని, అతని కంటే భయంకరమైన ప్లేయర్లు పాకిస్తాన్ జట్టులో ఉన్నారని బాంబు పేల్చాడు అహ్మద్ షెజాద్ ( Ahmed Shehzad). టీ20 క్రికెట్ లో అభిషేక్ శర్మ కంటే సైమ్ అయూబ్ (Saim Ayub ) అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ అంటూ వ్యాఖ్యానించాడు. అతడు సిక్సులు కొడితే అండమాన్ లో పడతాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట అహ్మద్ షెజాద్. దీంతో అహ్మద్ షెజాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అటు అహ్మద్ షెజాద్ కు ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. ఇండియా అలాగే శ్రీలంక వేదికగా జరగనున్న ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఆడేది ఇంకా క్లారిటీ రాలేదు. శుక్రవారం లేదా వచ్చే సోమవారం రోజున టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఆడే విషయంపై క్లారిటీ ఇవ్వనుంది పాకిస్తాన్ జట్టు. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముందుగా అభిషేక్ శర్మను టార్గెట్ చేసింది పాకిస్తాన్. అతని ఆత్మస్థైర్యం దెబ్బతినేలా తాజాగా అహ్మద్ షెజాద్ ( Ahmed Shehzad) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టి20 క్రికెట్ లో అభిషేక్ శర్మ కంటే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లు తమ పాకిస్తాన్ జట్టులో ఉన్నారని వెల్లడించారు. సైమ్ అయూబ్ (Saim Ayub ) టి20 లలో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడని… ఇతను అభిషేక్ శర్మ కంటే డేంజర్ గా ఆడతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు అహ్మద్ షెజాద్.
అలాంటి ప్లేయర్లు తమ జట్టులో చాలా మంది ఉన్నారని వ్యాఖ్యానించారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కూడా జరగనుంది. అయితే ఈ మ్యాచ్ వన్ సైడ్ గా జరగనుందని వెల్లడించారు అహ్మద్ షెజాద్. ఇందులో పాకిస్తాన్ కచ్చితంగా విజయం సాధిస్తుందని.. టీమిండియా చిత్తుగా ఓడిపోతుందని కూడా వెల్లడించారు. అయితే దీనిపై టీమిండియా అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. అభిషేక్ శర్మ ముందు ఏ ఒక్క పాకిస్తాన్ వాడు పనికిరాడు అని అంటున్నారు. అభిషేక్ శర్మను పాకిస్తాన్ క్రికెటర్ సైమ్ అయూబ్ తో పోల్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కుక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వెల్లడిస్తున్నారు. బుమ్రా బౌలింగ్ 6 బంతులకు 6 సిక్సులు కొడతాడని ఆసియా కప్ 2025 టైమ్ లోనే సైమ్ అయూబ్ గురించి బిల్డప్ ఇచ్చిన పాకిస్తాన్, ఇప్పుడు మళ్లీ వాడినే లేపే ప్రయత్నం చేస్తోంది.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
🚨 MASSIVE STATEMENT BY AHMED SHEHAZAD ON ABHISHEK SHARMA 🚨
Ahmed Shehzad Said🗣️
"Saim Ayub is better T-20 player than Abhishek Sharma".#AhmadShahzad #SaimAyub #AbhishekSharma #T20Cricket pic.twitter.com/MscOQsBomo
— lndian Sports Netwrk (@IS_Netwrk29) January 27, 2026