Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. మే 31వ తేదీన బెంగళూరు వర్సెస్ గుజరాత్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final,) మధ్య ఫైనల్ జరుగగా… విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒంటరి పోరాటం చేశాడు. 75 పరుగులు చేసి బెంగుళూరు జట్టును ఛాంపియన్ చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంటే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం విషం కక్కుతున్నారు. తాజాగా విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ మగాడు అయితే, పాకిస్తాన్ వచ్చి ఇక్కడి పిచ్ ల పైన ఆడాలని సవాల్ విసిరారు. అప్పుడే బాబర్ ఆజం ( Babar Azam) కంటే గొప్ప ప్లేయర్ అవుతాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికీ ఎప్పటికీ.. తన దృష్టిలో విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం గొప్ప ప్లేయర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు తన్వీర్ అహ్మద్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ సీరియస్ అయ్యారు. అల్లా మీద ఒట్టేసి చెబుతున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికీ ఎప్పటికీ… విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజం అతిపెద్ద ఆటగాడు అంటూ వ్యాఖ్యానించారు. బాబర్ ఏ టోర్నమెంట్ ఆడిన ఖచ్చితంగా 600 పరుగులు చేస్తాడని వెల్లడించారు. ఎలాంటి పిచ్ కండిషన్స్ ఉన్నా కూడా దుమ్ము లేపుతాడని స్పష్టం చేశారు. అదే విరాట్ కోహ్లీ… ఇండియాలో కాకుండా పాకిస్తాన్ వచ్చి ఇక్కడి పిచ్ లపై ఆడి చూపించాలంటూ సవాల్ విసిరారు.
పాకిస్తాన్ గడ్డ పైన ఆడి 600 పరుగులు చేసి చూపిస్తే… తాను ఇకపై విరాట్ కోహ్లీ గురించి మాట్లాడబోనని ఛాలెంజ్ చేశారు. పాకిస్తాన్ గడ్డపైన స్పిన్నర్ లేదా ఫాస్ట్ బౌలర్ ఎవరికైనా అద్భుతంగా పిచ్ అనుకూలిస్తుందని పేర్కొన్నారు. అసలు బ్యాటర్ పరుగులు చేయాలంటే… చాలా కష్టపడాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ వచ్చి 600 పరుగులు చేసి చూపించాలంటూ విరాట్ కోహ్లీకి సవాల్ విసిరారు. ఇండియాలో ప్రతి పిచ్.. బ్యాటింగ్ కు మాత్రమే అనుకూలిస్తుందని, పాకిస్తాన్ తరహాలో అక్కడ వ్యవస్థ ఉండబోదని వెల్లడించారు. పాకిస్తాన్ గడ్డ పైన ఆడిన వాడే మొనగాడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో బాబర్ ఆజంను తీసుకుంటే విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు చేసి చూపిస్తాడని బాంబు పేల్చారు.