E-Paper
Advertisement

Shah Rukh-Mustafizur: ముస్తాఫిజుర్, షారుఖ్ ఖాన్ నాలుక‌ కోసిన వాళ్ల‌కు రూ.ల‌క్ష రివార్డు

Shah Rukh-Mustafizur: ముస్తాఫిజుర్, షారుఖ్ ఖాన్ నాలుక‌ కోసిన వాళ్ల‌కు రూ.ల‌క్ష రివార్డు
Advertisement

Shah Rukh-Mustafizur:  ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కంటే ముందే కేకేఆర్ జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ జట్టుకు సంబంధించిన ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman ) ను ఐపీఎల్ 2026 టోర్న‌మెంట్ నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ దేశద్రోహి అంటూ రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై అరాచకాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి బంగ్లా క్రికెటర్లను ఇక్కడ ఎందుకు ఆడిస్తారని నిలదీస్తున్నారు. శివసేనతోపాటు హిందూ సంఘాలు కూడా ఈ అంశంపై సీరియస్ గా ఉన్నాయి.

Also Read: BCCI central contracts: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి షాక్‌..గిల్ కు ప్ర‌మోష‌న్‌..ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?

ముస్తాఫిజుర్ రహమాన్, షారుఖ్ నాలుక కోస్తే లక్ష రూపాయలు

Advertisement

బంగ్లాదేశ్ లో మారణకాండ కొనసాగుతోంది. హిందువులపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు అక్కడి ముస్లింలు. ఇప్పటికే ముగ్గురు హిందువులను అత్యంత కిరాతకంగా బంగ్లాదేశ్ లో హతమార్చారు. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్లేయర్లను ఐపీఎల్ టోర్నమెంటులో ఆడించకూడదని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ముస్తాఫిజుర్ రహమాన్ ను ఆడిస్తున్న షారుఖ్ ఖాన్ నాలుక కోయండి అంటూ హిందూ మహాసభ నాయకురాలు మీరా రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షారుక్ ఖాన్ ఒక్కడిదే కాదు, ముస్తాఫిజుర్ రహమాన్ నాలుక కోసిన వాళ్లకు లక్ష రూపాయల బహుమతి ఇస్తానని కూడా ఆమె సంచలన ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన ముస్తాఫిజుర్ రహమాన్ ను కొనుగోలు చేసిన షారుక్ ఖాన్ దేశద్రోహి అంటూ ఫైర్ అయ్యారు.

బంగ్లాదేశ్ లో హిందువులను చంపుతుంటే… ఆ దేశ ప్లేయర్లను ఐపీఎల్ లో ఎలా ఆడిస్తారు? అసలు వాళ్లను ఎందుకు కొనుగోలు చేశారని నిలదీశారు మీరా రాథోడ్. మా హిందూ సోదరులను బంగ్లాదేశ్ లో దహనం చేశారని ఎమోషనల్ అయ్యారు. అలాంటి బంగ్లాదేశ్ క్రికెటర్లను కొనుగోలు చేసిన షారుఖ్ ఖాన్ కు ఇండియాలో జీవించే హక్కు లేదని తేల్చి చెప్పారు. షారుక్ ఖాన్ దిగజారి ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైనా ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman ) ను జట్టులోంచి తొలగించాలని ఆమె ఫైర్ అయ్యారు.

ఐపీఎల్ 2026 లో ముస్తాఫిజుర్ రహమాన్ ఆడడం కష్టమే?

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఆడడం కష్టమే అని అంటున్నారు. 9.20 కోట్లు కేకేఆర్ ఇతన్ని కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అతన్ని ఆడించకూడదని ఇండియాలో నిరసనలు మొదలయ్యాయి. దీనిపై బీసీసీఐ అధికారి కూడా స్పందించారు. బంగ్లాదేశ్ క్రికెటర్ల పై బ్యాన్ విధించాలని కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేవని ఆయన వివరించారు. ఒకవేళ బ్యాన్ విధించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే కచ్చితంగా పాటిస్తామని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ఇదే జరిగితే కేకేఆర్ 9.20 కోట్లు నష్టపోవడం గ్యారంటీ అంటున్నారు.

Also Read: Monty Panesar: వీడి ముఖానికి టీమిండియా హెడ్ కోచా ? గ‌ల్లీ క్రికెట్ కు కూడా ప‌నికిరాడు, గంభీర్ ఇజ్జ‌త్ తీశాడుగా ! 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×