Shah Rukh-Mustafizur: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కంటే ముందే కేకేఆర్ జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆ జట్టుకు సంబంధించిన ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman ) ను ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు కేకేఆర్ ఓనర్ షారుక్ ఖాన్ దేశద్రోహి అంటూ రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై అరాచకాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి బంగ్లా క్రికెటర్లను ఇక్కడ ఎందుకు ఆడిస్తారని నిలదీస్తున్నారు. శివసేనతోపాటు హిందూ సంఘాలు కూడా ఈ అంశంపై సీరియస్ గా ఉన్నాయి.
బంగ్లాదేశ్ లో మారణకాండ కొనసాగుతోంది. హిందువులపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు అక్కడి ముస్లింలు. ఇప్పటికే ముగ్గురు హిందువులను అత్యంత కిరాతకంగా బంగ్లాదేశ్ లో హతమార్చారు. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్లేయర్లను ఐపీఎల్ టోర్నమెంటులో ఆడించకూడదని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు ముస్తాఫిజుర్ రహమాన్ ను ఆడిస్తున్న షారుఖ్ ఖాన్ నాలుక కోయండి అంటూ హిందూ మహాసభ నాయకురాలు మీరా రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షారుక్ ఖాన్ ఒక్కడిదే కాదు, ముస్తాఫిజుర్ రహమాన్ నాలుక కోసిన వాళ్లకు లక్ష రూపాయల బహుమతి ఇస్తానని కూడా ఆమె సంచలన ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన ముస్తాఫిజుర్ రహమాన్ ను కొనుగోలు చేసిన షారుక్ ఖాన్ దేశద్రోహి అంటూ ఫైర్ అయ్యారు.
బంగ్లాదేశ్ లో హిందువులను చంపుతుంటే… ఆ దేశ ప్లేయర్లను ఐపీఎల్ లో ఎలా ఆడిస్తారు? అసలు వాళ్లను ఎందుకు కొనుగోలు చేశారని నిలదీశారు మీరా రాథోడ్. మా హిందూ సోదరులను బంగ్లాదేశ్ లో దహనం చేశారని ఎమోషనల్ అయ్యారు. అలాంటి బంగ్లాదేశ్ క్రికెటర్లను కొనుగోలు చేసిన షారుఖ్ ఖాన్ కు ఇండియాలో జీవించే హక్కు లేదని తేల్చి చెప్పారు. షారుక్ ఖాన్ దిగజారి ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పటికైనా ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman ) ను జట్టులోంచి తొలగించాలని ఆమె ఫైర్ అయ్యారు.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఆడడం కష్టమే అని అంటున్నారు. 9.20 కోట్లు కేకేఆర్ ఇతన్ని కొనుగోలు చేసింది. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అతన్ని ఆడించకూడదని ఇండియాలో నిరసనలు మొదలయ్యాయి. దీనిపై బీసీసీఐ అధికారి కూడా స్పందించారు. బంగ్లాదేశ్ క్రికెటర్ల పై బ్యాన్ విధించాలని కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేవని ఆయన వివరించారు. ఒకవేళ బ్యాన్ విధించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే కచ్చితంగా పాటిస్తామని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ఇదే జరిగితే కేకేఆర్ 9.20 కోట్లు నష్టపోవడం గ్యారంటీ అంటున్నారు.
After spiritual leader #DevkinandanThakur, #JagadguruRambhadracharya and BJP leader #SangeetSom, now Hindu Mahasabha leader Meera Rathore has slammed Shah Rukh Khan for buying Bangladeshi player Mustafizur Rahman for his team, Kolkata Knight Riders.
Rathore said, "Hamaare… pic.twitter.com/CTqrMl8mCS
— DNA (@dna) January 2, 2026