Mohsin Naqvi -Vaibhav: అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదంగా మారింది. నా బూట్లు నాకండి రా అంటూ పాకిస్తాన్ క్రికెటర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు వైభవ్ సూర్యవంశీ. అంతకుముందు పాకిస్తాన్ అండర్ 19 ప్లేయర్లు రెచ్చగొట్టడంతో, కాస్త ఓవర్గా రియాక్ట్ అయి వైభవ్ సూర్యవంశీ, కాస్త టెంప్ట్ అయ్యాడు. అయితే ఈ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చాలా సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ బాస్ మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) కూడా రంగంలోకి దిగారట. టీమిండియా ప్లేయర్ లందరిపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేశారట.
అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ ( Under-19 Asia Cup 2025 tournament final ) నేపథ్యంలో మన టీమ్ ఇండియా అండర్ 19 ప్లేయర్లు, కాస్త ఓవరాక్షన్ చేసిన సంగతి తెలిసిందే. అటు పాకిస్తాన్ ప్లేయర్లు కూడా చెత్తగా బిహేవ్ చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లపై ఐసీసీకి ఫిర్యాదు చేయబోతున్నట్లు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) సంచలన ప్రకటన చేశారు. మ్యాచ్ జరిగినంత సేపు టీమిండియా ప్లేయర్లు రెచ్చిపోయారని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ ప్లేయర్లను రెచ్చగొడుతూనే ఉన్నారని టీమిండియా ప్లేయర్లపై సంచలన ఆరోపణలు చేశారు.
రాజకీయాల అలాగే ఆటలను వేరుగా చూడాలని ఈ సందర్భంగా కోరారు. టీమిండియా ప్లేయర్ల తీరుపై ఐసీసీకి త్వరలోనే ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. ముఖ్యంగా వైభవ్ సూర్య వంశీ తోక కట్ చేయడం గ్యారెంటీ అంటూ ఆయన పేర్కొన్నారు. వైభవ్ సూర్య వంశీ బిహేవ్ చేసిన పద్ధతి అస్సలు బాగాలేదని, తమ బౌలర్ ను ఉద్దేశించి బూట్లు చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని ఫైర్ అయ్యారు. అలాంటి వాడిని అస్సలు వదిలిపెట్టమని మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతనిపై లైఫ్ టైం బ్యాన్ వేసేలా ఐసీసీకి ఆధారాలు సమర్పిస్తామని కూడా తెలిపాడట.
మొన్న ఆదివారం అంటే డిసెంబర్ 21వ తేదీన అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా అలాగే పాకిస్తాన్ ( India U19 vs Pakistan U19, Final ) రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో పాకిస్తాన్ ఏకంగా 191 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో అండర్ 19 ఆసియా కప్ ఛాంపియన్గా నిలిచింది పాకిస్తాన్. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా టైటిల్ అందుకోవడం జరిగింది.