E-Paper
Advertisement

CSK, ధోని మ‌ధ్య చిచ్చు పెట్టిన కిలాడీ లేడీ ?

CSK, ధోని మ‌ధ్య చిచ్చు పెట్టిన కిలాడీ లేడీ ?
Advertisement

MS Dhoni – CSK Shares:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని…ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా రికార్డులు సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా టోర్నమెంట్ ప్రారంభంలోనే బాధ్యతలు తీసుకొని… ఆ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన మొనగాడు ధోని. ఐదు సార్లు ట్రోఫీలు అందించడమే కాకుండా చాలా సార్లు ఫైనల్స్ దాకా తీసుకువెళ్లాడు. ఇప్పటికి కూడా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ… ముందుకు సాగుతున్నాడు. త్వరలో ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు షేర్స్ కొనుగోలు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారట.

చెన్నై సూపర్ కింగ్స్ షేర్స్ కొనేందుకు సిద్ధమైన ధోని

ఎన్నో ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సేవలు అందించిన మహేందర్ సింగ్ ధోని… త్వరలో ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇవ్వబోతున్నారట. అయితే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు షేర్స్ కొనుగోలు చేసేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నట్లు క్రిక్ బజ్ వెల్లడించింది. ఈ క్రిక్ బజ్ నివేదిక ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో 25% ధోని డిమాండ్ చేశాడట. అయితే, ప్రమోటర్లు మాత్రం మూడు శాతమే ఇస్తామని తెగేసి చెప్పారట. దీంతో కాస్త తగ్గిన ధోని 20 శాతం వాటాను అయినా ఇవ్వాలని తెలిపాడట. యాజమాన్యం కాస్త పెంచి నాలుగు శాతానికి వచ్చిందని సమాచారం.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

ఇక చివరికి ధోని 18% వాటా అడిగాడట. అయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం 5.5% వరకు వచ్చి సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో షేర్లకు కొనుగోలు నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకున్నారట. అయితే ధోని ఉచితంగానే ఈ వాటాలను అడిగాడని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం భావించి.. ఇలా దారుణంగా వ్యవహరించిందని జాతీయ మీడియాలు పేర్కొంటున్నాయి. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలని అనుకున్న ధోని.. ఈ విషయాన్ని ముందుగా చెప్పలేదట. ఇలా ధోని, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఈ డీల్ క్యాన్సిల్ అయింది అని చెబుతున్నారు.

చెన్నై సూపర్ కింగ్స్, ధోని మధ్య చిచ్చు పెట్టిన లేడీ ?

Advertisement

చెన్నై సూపర్ కింగ్స్ అలాగే ధోని మధ్య చిచ్చు పెట్టింది ఆయన సతీమణి సాక్షి అని చెబుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో షేర్లు కొనుగోలు చేయాలని ధోని పై ఒత్తిడి తీసుకువచ్చారట సాక్షి. అందుకే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చి షేర్లపై కన్నేశాడట ధోని. కానీ ఈ డీల్ విఫలమైంది. అంతేకాదు చెన్నై వర్సెస్ ధోని అన్నట్లుగా వ్యవహారం తయారు అయింది. మరి వచ్చే సీజన్లో ధోని అదే జ‌ట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Related News

గంభీర్ కోచ్ గా ప‌నికిరాడు…బ‌ల‌మైన‌ టీమిండియాను ఉగాండాగా మార్చేశాడు !

రంభ ఊర్వశి మేనక మూవీలో గౌత‌మ్ గంభీర్..ఇక థియేట‌ర్లు బ‌ద్ద‌లు కొట్టాల్సిందే

బ్యాటింగ్ చేత‌కాదు కానీ, రౌడీలా ఫైటింగ్ చేస్తున్నాడు

వీల్ చైర్ పై వచ్చైనా రెండో టెస్టులో బాబ‌ర్ ఆజం ఆడాలి

మొద‌టి బంతికే 80 ప‌రుగులు…టీమిండియా క్రికెట‌ర్ స‌రికొత్త రికార్డ్

గ‌జ దొంగ‌ న‌ఖ్వీ ప‌క్క‌న కూర్చోడానికి సిగ్గులేదా ? శుక్లా ప‌రువు తీసిన ఇర్ఫాన్ ప‌ఠాన్‌

సారా ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీసే ప్ర‌య‌త్నం… వార్నింగ్ ఇచ్చిన సచిన్ !

Big Stories

Advertisement
×