Wasim Jaffer bashed Jaiswal badly: టీమిండియా వర్సెస్ శ్రీలంక ( Team India vs. Sri Lanka) మధ్య రెండో టెస్టు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో ఇప్పటికే తొలి ఇన్నింగ్స్ ముగించిన టీమిండియా ( Team India)… మంచి లీడ్ సంపాదించింది. అటు మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను 300 లోపే కట్టడి చేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే 8 వికెట్లు నష్టపోయిన శ్రీలంక, రేపు ఉదయం స్టేషన్ లోనే ఆల్ అవుట్ అయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal ), అసిత ఫెర్నాండో ( Asitha Fernando ) మధ్య జరిగిన గొడవ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో ఇద్దరి పైన కూడా ఫైన్ వేసింది ఐసీసీ.
శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండో ( Asitha Fernando ) గెలికిన నేపథ్యంలో యశస్వి జైస్వాల్ రెచ్చిపోయాడు. ముందు గెలికింది శ్రీలంక బౌలర్ అయినప్పటికీ… మనోడి ఓవరాక్షన్ మాత్రం కాస్త ఇబ్బందిగానే తయారయింది. అయితే దీనిపై తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ (Wasim Jaffer ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గిల్లితే గిల్లించుకోవాలి… అంతేకానీ ఓవర్ చేయకూడదని యశస్వి జైస్వాల్ ను తప్పు పట్టారు. క్రికెట్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal ) ఇలా ప్రతి దానికి గొడవ పెట్టు కోకూడదని వార్నింగ్ ఇచ్చారు.
మైదానంలో ఇలాంటి ప్రవర్తన ఏ మాత్రం కరెక్ట్ కాదని మండిపడ్డారు. అవతలి వ్యక్తి మనల్ని రెచ్చగొడతాడు… కానీ ఓపికగా క్రీడా స్ఫూర్తితో వ్యవహరించాలని యశస్వి జైస్వాల్ కు చురకలు అంటించారు. యశస్వి జైస్వాల్ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదని… గతంలో కూడా ఇలా అడ్డమైన గొడవలను మీదకు తెచ్చుకున్నాడని ఆగ్రహించారు. ఈ టెస్ట్ సిరీస్ లో యశస్వి జైస్వాల్ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదని… కానీ గొడవలు మాత్రం పెట్టుకుంటున్నాడని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ (Wasim Jaffer ).
టెస్టుల్లో వచ్చిన అవకాశాలను వినియోగించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే… యశస్వి జైస్వాల్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందని వసీం జాఫర్ హెచ్చరించారు. భవిష్యత్తులో అతనికి టీమిండియాలో ఛాన్స్ కూడా రాబోదని వార్నింగ్ ఇచ్చారు. అనవసరంగా గొడవలకు వెళ్లకుండా… వీరేంద్ర సెహ్వా లాగా త్రిపుల్ సెంచరీలు చేసి చూపించాలని సూచనలు చేశారు. బ్యాట్ తో ప్రతి వివాదానికి సమాధానం చెప్పాల్సిందేనని వెల్లడించారు. టీమిండియాలో ఛాన్సులు వరుసగా రావాలంటే, కచ్చితంగా ప్రతీ మ్యాచ్ లోనూ రాణించాలన్నారు.