E-Paper
Advertisement

MS DHONI: ధోని రిటైర్మెంట్…ఇదిగో ఇదే సాక్ష్యం ?

MS DHONI: ధోని రిటైర్మెంట్…ఇదిగో ఇదే సాక్ష్యం ?
Advertisement

MS DHONI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో…. మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. మహేంద్ర సింగ్ ధోనీ ఇవాళ రిటర్మెంట్ ప్రకటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి ప్రత్యేక కారణం లేకపోలేదు. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్… పోరాడుతోంది. అయితే చెన్నై హోమ్ గ్రౌండ్ కావడంతో… అభిమానులు భారీ గానే స్టేడియానికి వచ్చారు.

Also Read:  LSG Vs MI: తిలక్ రిటైర్డ్ హర్ట్.. పాండ్యా పై ట్రోలింగ్.. అసలు ఈ వివాదం ఏంటి?

Advertisement

చెపాక్ స్టేడియానికి ధోని కుటుంబం

చెన్నై వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ నేపథ్యంలో… చెపాక్ స్టేడియానికి ధోని ఫ్యామిలీ కూడా… రావడం జరిగింది. ధోని ఫ్యామిలీ అంటే కేవలం సాక్షి ధోని అలాగే ఆయన కూతురు… అనుకుంటే పొరపాటే. ఎన్నడూ లేని విధంగా మహేంద్రసింగ్ ధోని పేరెంట్స్ కూడా వచ్చారు. చెన్నై మ్యాచ్ కోసం మహేంద్రసింగ్ ధోని తల్లి దండ్రులు రావడం గమనార్హం. చాలా సింపుల్ గా స్టేడియానికి వచ్చిన మహేంద్ర సింగ్ ధోని పేరెంట్స్… ఎంజాయ్ గా మ్యాచ్ చూస్తున్నారు.

Advertisement

దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ తరుణంలోనే.. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్, మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్… రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే లాస్ట్ మ్యాచ్ అని కొంతమంది అంటున్నారు. అందుకే తన కుటుంబం మొత్తం ఇవాళ చెన్నై మ్యాచ్కు వచ్చిందని చెబుతున్నారు. వాళ్ళ మధ్యలో మ్యాచ్ ఆడిన తర్వాత… ఇవాళ ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చెబుతున్నారు. ఈ దెబ్బకు సోషల్ మీడియాలో కూడా ధోని రిటైర్మెంట్ అనే హ్యాష్ టాగ్ కూడా వైరల్ అవుతుంది.

Also Read: Digvesh Singh Rathi: మరోసారి వివాదం… దిగ్వేశ్‌‌కు మళ్లీ ఫైన్.. ఈసారి ఏకంగా!

చెన్నై సూపర్ కింగ్స్ కు 5 ట్రోఫీలు తెచ్చిన మహేంద్ర సింగ్ ధోని

టీమిండియా కెప్టెన్ గా కొనసాగిన మహేంద్ర సింగ్ ధోని… తన కెప్టెన్సీలో ఇండియాకు టి20 వరల్డ్ కప్, వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ అందించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత… చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా అఖండ విజయాలను అందించాడు మహేంద్రసింగ్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఏకంగా ఐదు సార్లు చాంపియన్గా నిలిపిన ఏకైక కెప్టెన్ గా చరిత్రలో నిలిచాడు మహేంద్రసింగ్ ధోని. 2010, 2011 సంవత్సరాలలో వరుసగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్రసింగ్ ధోని కెప్టెన్సీలో.. ట్రోఫీ గెలుచుకుంది. ఆ తర్వాత 2018, 2021 అలాగే 2023 సంవత్సరాలలో కూడా టోర్నమెంట్ గెలుచుకుంది. ఆ తర్వాత సాధారణ ప్లేయర్ గానే చెన్నై సూపర్ కింగ్స్ లో కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోని.

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×