Lalit Modi On Ms Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని ఏజ్ అయిపోయినప్పటికీ… అతడిని రిటైర్మెంట్ కాకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని బాంబు పేల్చారు. అతనితో కోట్లల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారని… దీని వెనుక పెద్ద ముఠా ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే బలవంతంగా అతడిని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడిస్తున్నారని కూడా పేర్కొన్నారు. ఇప్పటికైనా రిటైర్మెంట్ ప్రకటించి చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్ గా ధోని బాధ్యతలు తీసుకుంటే బెటర్ అన్నారు. లేకపోతే టీమ్ ఇండియా తరఫున అవకాశం వస్తే కోచ్ లేదా మెంటల్ గా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయని కీలక సూచనలు కూడా చేశారు లలిత్ మోడీ.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007 సమయంలో టీమిండియా కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న మహేంద్రసింగ్ ధోని, 2017 వరకు కొనసాగారు. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్ లోనే కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా కొన్ని సంవత్సరాలు కొనసాగిన ధోని, ఆ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించాడు. చాలా సార్లు ఫైనల్ లేదా సెమీఫైనల్ లాగా వెళ్లి కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఇంటిదారి పట్టింది.
ధోని వయసు 45 సంవత్సరాలు దాటింది. అయినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును పట్టుకొని ఉండిపోయాడు. మొన్నటి సీజన్ లో మైదానంలో దిగకపోయినప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊపు తెచ్చాడు. వచ్చే సీజన్ కూడా అతడు ఆడే అవకాశాలే ఉన్నాయి. ఇంత జరుగుతున్న అతడు మాత్రం రిటైర్మెంట్ ఊసు ఎత్తడం లేదు. దీంతో ఐపిఎల్ లో ధోని ఎప్పుడు రిటైర్మెంట్ ఇచ్చేది ఎవరికి అర్థం కావడం లేదు.
ధోని ఐపిఎల్ రిటైర్మెంట్ పై తాజాగా లలిత మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని ఉంటేనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వ్యాల్యూ ఉంటుందని వెల్లడించారు. ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ, స్పాన్సర్ షిప్ లు, టీవీ వ్యూయర్షిప్, టీవీ యాడ్స్ ఒప్పందాలని ధోని రిటైర్మెంట్ చుట్టే తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఒక్కసారి ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ కూడా తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే ఈ వ్యాపార సామ్రాజ్యం దెబ్బకూడదనే ఉద్దేశంతో… ధోనీ రిటైర్మెంట్ కాకుండా చెన్నై సూపర్ కింగ్స్, బీసీసీఐ, మార్కెటింగ్ వర్గాలు అతనిపై ఒత్తిడి తెస్తున్నాయని వెల్లడించారు లలిత్ మోడీ. అంతే తప్ప ధోని పీకిందేమీ లేదన్నట్లుగా మాట్లాడారు. ఐదు ఓవర్లు కూడా నిలబడి లేని స్థితిలో ధోని ఉన్నాడని తెలిపారు. ఇంత ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ప్లేయర్ గా ధోని రిటైర్మెంట్ ఇచ్చి.. మెంటార్ గా కొనసాగితే బెస్ట్ అని సూచించారు.