PM Modi On SRH: ది హండ్రెడ్ లీగ్ వేలంలో ( The Hundred League Auction ) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ( Abrar Ahmed) ను కొనుగోలు చేసిన కావ్య పాపపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ప్లేయర్ ను కొనుగోలు చేసినందుకు గాను కావ్య పాపను దేశద్రోహి అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమెను ర్యాగింగ్ చేస్తూ.. దారుణంగా ఆడుకుంటున్నారు ఇండియన్ ఫ్యాన్స్. అయితే ఈ విషయంలో కొంతమంది ఆమెను సపోర్ట్ చేస్తున్నప్పటికీ, మెజారిటీ అభిమానులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ( SRH) కూడా ఐదు సంవత్సరాల పాటు బ్యాన్ విధించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదం పై ప్రధాని నరేంద్ర మోడీ ( Pm Modi) స్పందించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ గా మారింది. పాకిస్తాన్ ప్లేయర్ ను ఏ జట్టు కొనుగోలు చేసినా, బ్యాన్ చేయడం గ్యారెంటీ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా కావ్య పాపను ( Kavya Maran) ఉద్దేశించి మాట్లాడలేదు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు జనాలు.
పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన నేపథ్యంలో కావ్య పాపపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ జటిలమైన అంశంపై తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ స్పందించినట్లు వార్త వైరల్ గా మారింది. పాకిస్తాన్ ప్లేయర్ లందరూ ఉగ్రవాదులతో సమానమే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వాళ్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ( Indian Premier League Tournament ) ఆడించే సమస్య లేదు… పాకిస్తాన్ కు సంబంధించిన ఒక్క ప్లేయర్ ను కూడా వేలంలో కొనుగోలు చేసే పర్మిషన్ ఎవరికి లేదని కుండ బద్దలు కొట్టి చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi ).
ఒకవేళ పాకిస్తాన్ ప్లేయర్ ను కొనుగోలు చేసిన జట్టుపైన కచ్చితంగా బ్యాన్ విధిస్తామని హెచ్చరించారు. అలా ఆధారాలు బయటపడితే పర్మినెంట్ బ్యాన్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులతో సమానమైన పాకిస్తాన్ ప్లేయర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో అడుగుపెట్టడానికి అవకాశం ఇవ్వకూడదని పేర్కొన్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఎక్కడ కూడా కావ్య పాప గురించి మాట్లాడలేదు. ఆయన కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ గురించి మాత్రమే మాట్లాడారు. ది హండ్రెడ్ లీగ్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ కావ్య పాప గురించే ఈ వార్నింగ్ మోడీ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు.