NZ vs Pak Super 8: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా ఇవాళ సూపర్ 8 ( Super 8) స్టేజ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సూపర్ 8 లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ ( New Zealand vs Pakistan) మధ్య కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ( R.Premadasa Stadium, Colombo) వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ కొలంబోలో ఇవాళ సాయంత్రం నుంచి భారీ వర్షం పడింది. ఈ నేపథ్యంలోనే ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది. రిజర్వ్ డే ఆప్షన్ లేకపోవడంతో, మ్యాచ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు. దీంతో న్యూజిలాండ్ అలాగే పాకిస్తాన్ కు చెరో పాయింట్ లభించింది. అయితే చెరో పాయింట్ దక్కించుకున్న పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లకు కొత్త టెన్షన్ మొదలైంది. సూపర్ 8లో మిగిలిన రెండు మ్యాచ్ లలో కచ్చితంగా ఈ రెండు జట్లు గెలవాలి. లేకపోతే సెమీ ఫైనల్ అవకాశం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. దీంతో పాకిస్తాన్, కివీస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
టి20 ప్రపంచ కప్ సూపర్ 8 లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కొలంబో లోని ప్రేమదాస స్టేడియం వేదికగా మ్యాచ్ జరగాల్సిన సంగతి తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ టాస్ ప్రక్రియ ముగిసిన నుంచి భారీ వర్షం పడింది. టాస్ పడిన తర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ప్లేయర్లు బ్యాటింగ్ చేసేందుకు వచ్చే క్రమంలోనే వర్షం అందుకుంది. దాదాపు మూడు గంటలుగా వర్షం పడుతూనే ఉంది. చివరలో 5 ఓవర్ల మ్యాచ్ అయిన నిర్వహించాలని అంపైర్లు భావించారు. కానీ పరిస్థితి అనుకూలించడం లేదు. దీంతో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగాల్సిన సూపర్ 8 మ్యాచ్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రిజర్వ్ డే లేకపోవడంతో చెరో పాయింట్ లభించింది.
కొలంబోలోని ప్రేమదాస వేదికగా శనివారం జరగాల్సిన తొలి సూపర్ 8 మ్యాచ్ రద్దయింది. దీంతో పాకిస్తాన్ జట్టుకు కొత్త టెన్షన్ మొదలైంది. మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్ వచ్చినప్పటికీ… సూపర్ 8 లో భాగంగా మిగిలిన రెండు మ్యాచ్ లు కచ్చితంగా గెలవాల్సిందే. శ్రీలంక అలాగే ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్లతో పాకిస్తాన్ తలపడాలి. ఈ రెండు మ్యాచ్ లలో విజయం సాధిస్తేనే పాకిస్తాన్ కు సెమీ ఫైనల్ అవకాశాలు ఉంటాయి. ఒక్క మ్యాచ్ ఓడిపోయిన సెమీ ఫైనల్ ( Pakistan Semi final) ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ఉంటుంది. లేదా రన్ రేట్ మెయింటేన్ చేసుకుంటూనే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అదృష్టం బాగుంటే తప్ప పాకిస్తాన్ సెమీ ఫైనల్ వెళ్లే అవకాశం లేదు. దీంతో పాకిస్తాన్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇటు ఇండియాలో సంబరాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ జట్టును వరుణుడు దెబ్బ కొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. బాబర్ ఆజం మాత్రం శ్రీలంకకు సంబంధించిన సీ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేశాడు.
CRUCIAL GAMES AHEAD FOR PAKISTAN.
– Pakistan will play England on 24th February in Kandy.
– 2 out of 2 wins will put Pakistan in the semi finals.
– 1 defeat will put Pakistan in a typical "ifs & buts" situation. pic.twitter.com/ebxHImRv5M
— Salman. (@TsMeSalman) February 21, 2026