PCB ON Vaibhav: జింబాబ్వే వర్సెస్ టీమిండియా మధ్య టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టి 20 సిరీస్ నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. జింబాబ్వే తో జరిగిన మొదటి టి20 సందర్భంగా కేవలం 18 బంతుల్లో అర్థ సెంచరీ నమోదు చేసి ఇరగదీశాడు. దీంతో సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశీ పేరు మళ్లీ మారుమోగుతోంది. అటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా వైభవ్ గురించి సంచలన పోస్ట్ కూడా పెట్టింది. 15 ఏళ్ల వయసులోనే అర్థ సెంచరీ చేసిన వీరుడు అంటూ సోషల్ మీడియాలో హైప్ ఇస్తోంది ఐసీసీ.
Also Read: ఆ పాకిస్తాన్ వెధవను వద్దని మొత్తుకున్నా, కావ్యనే వినలేదు.. SRH కోచ్ సీరియస్
15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పైన సోషల్ మీడియాలో ఐసీసీ కూడా తెగ పోస్టులు పెట్టడంపై పాకిస్తాన్ కు గుర్రుగా ఉంది. అంతా పోటుగాడా ? ఒక అర్థ సెంచరీకే వైభవ్ గురించి ఐసీసీ రియాక్ట్ కావడం అవసరమా ? పసికూన జింబాబ్వే పైన అర్థ సెంచరీ చేస్తే వరల్డ్ కప్ గెలిచినట్లు ఫీల్ అవుతున్నారు… ఇది ఎంతవరకు సమంజసం ? అంటూ పాకిస్తాన్ సోషల్ మీడియాలో అత్యంత దారుణమైన పోస్టులు పెడుతున్నారు.
అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా దీనిపై సీరియస్ గా ఉంది. వైభవ్ కంటే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో చాలామంది తోపు క్రికెటర్లు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. బాబర్ ఆజం, షాహిన్ అఫ్రిది, ఫర్హాన్, నసీం షా లాంటి చాలామంది క్రికెటర్లు తమ కెరీర్ ప్రారంభంలో కూడా అనేక రికార్డులు సాధించారని వెల్లడిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఆ సమయంలో తమ క్రికెటర్లకు ఐసీసీ ఎలాంటి హడావిడి చేయలేదని.. ఎన్ని రికార్డులు సాధించినా పట్టించుకోలేదని మండిపడుతోంది. కానీ జింబాబ్వే పై కేవలం అర్థ సెంచరీ నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ పై మాత్రం ఐసీసీ ఓవర్ గా పోస్టులు పెడుతోందని సెటైర్లు పేల్చుతోంది. అనవసరంగా వైభవ్ ను హీరో చేస్తున్నారని ఫైర్ అయింది.
జింబాబ్వే పై వైభవ్ సూర్యవంశీ అర్ధ సెంచరీ చేసిన నేపథ్యంలో ఐసీసీ పొగడ్తల వర్షం కురిపించింది. దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా రెచ్చిపోయి కామెంట్ చేస్తున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో క్రికెట్ లోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ గురించి ఐసీసీ డబ్బా కొడుతుందని మండిపడ్డారు. 15 ఏళ్ల బుడ్డోడు అని సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారని ఆగ్రహించారు. వాస్తవంగా వైభవ్ సూర్యవంశీ వయస్సు 15 సంవత్సరాలు కాదని… 22 సంవత్సరాలు ఉంటాడని పేర్కొంటున్నారు. కానీ తప్పుడు లెక్కలు చూపించి.. 15 ఏళ్ల బుడ్డోడుగా కవరింగ్ ఇస్తున్నాడని ఆరోపణలు చేశారు. దీనిపై ఐసీసీ విచారణ చేయాల్సింది పోగా… పొగడ్తల వర్షం కురిపించడం ఏంటని నిలదీశారు. దీనంతటికీ కారణం ఐసీసీ బాస్ జై షా అంటూ హేళన చేస్తున్నారు.
Also Read: 6, 6, 6, 6 వైభవ్ సిక్సుల వర్షం..A సింబల్ చూపిస్తూ సెలబ్రేషన్స్, టీమిండియా విజయం
🚨 ICC DOUBLE STANDARDS?
– ICC should appreciate young talent from every nation equally.
– Vaibhav Suryavanshi scored a fifty against Zimbabwe and was given a special spotlight, but many young Pakistani cricketers have scored impressive fifties and centuries over the years… pic.twitter.com/SPT5XfkVW8
— Talha Nawaz (@TalhaDigital007) July 23, 2026