E-Paper
Advertisement

Pakistan Cricket: 37 ప‌రుగుల‌కే ఆలౌట్.. 231 ఏళ్ల‌ ప్రపంచ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన పాకిస్తాన్‌

Pakistan Cricket: 37 ప‌రుగుల‌కే ఆలౌట్.. 231 ఏళ్ల‌ ప్రపంచ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన పాకిస్తాన్‌
Advertisement

Pakistan Cricket: క్రికెట్… ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న గేమ్. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన క్రికెట్ ఆడడం చూస్తూ ఉంటాం. దానికి తగ్గట్టుగానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో రకరకాల టోర్నమెంట్లు తెరపైకి వస్తున్నాయి. అదే సమయంలో అరుదైన రికార్డులు కూడా క్రికెట్ చరిత్రలో నమోదు అవుతున్నాయి. తాజాగా పాకిస్తాన్ లోని డొమెస్టిక్ క్రికెట్ జట్టు అరుదైన రికార్డు సాధించింది. 231 సంవత్సరాల ప్రపంచ రికార్డును ఈ పాకిస్తాన్ దేశానికి చెందిన పాకిస్తాన్ టెలివిజన్ జట్టు బద్దలు కొట్టింది. ఓ మ్యాచ్ లో పాకిస్తాన్ టెలివిజన్ జట్టు ( Pakistan Television) నలభై పరుగులు చేయగా.. సుయి నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ జట్టు 37 పరుగులకు ఆలౌట్ అయి ఈ చరిత్ర సృష్టించింది. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: Team India: టీమిండియా కోసం రంగంలోకి జహీర్ ఖాన్..ఆ పోస్ట్ ఫైన‌ల్..ఇక మ‌నోళ్ల‌ను ఆప‌డం క‌ష్ట‌మే

231 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు

Advertisement

పాకిస్తాన్ దేశంలో దేశవాళీ జట్లు చాలానే ఉన్నాయి. ఆ దేశంలో ప్రస్తుతం క్వాయిడ్ ఏ ఆజాం ట్రోఫీ ( Quaid-e-Azam Trophy 2026) జరుగుతోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ టెలివిజన్ వర్సెస్ సుయి నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ జట్ల ( Sui Northern Gas Pipelines Limited) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 40 పరుగుల అత్యల్ప లక్ష్యాన్ని సుయి నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ జట్టు ముందు పాకిస్తాన్ టెలివిజన్ జట్టు ఉంచింది. అయితే ఈ 40 పై పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో సుయి నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ జట్టు 37 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 19.4 ఓవర్లు ఆడిన జట్టు… దారుణంగా వికెట్లు కోల్పోయి 37 పరుగులకు కుప్పకూలింది. ఇందులో ముగ్గురు డక్ అవుట్ కాగా ఒకే ఒక్కడు డబుల్ డిజిట్ స్కోరు సాధించాడు. అందరూ సింగిల్ డిజిట్ కు ఫెవిలియన్ కి వెళ్లారు. ఇక 2 పరుగుల తేడాతో విజయం సాధించిన పాకిస్తాన్ టెలివిజన్ జట్టు 231 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. 1794 సంవత్సరంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఆ సమయంలో కెంట్ జట్టుపై 44 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది మెరిల్బోన్ క్రికెట్ క్లబ్. ఇక ఇప్పుడు ఆ రికార్డును పాకిస్తాన్ టెలివిజ‌న్ జ‌ట్టు… సుయి నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ పై బ‌ద్ద‌లు కొట్టింది.

పాకిస్తాన్ టెలివిజన్ జట్టు చారిత్రాత్మక విజయం

దేశవాళి క్రికెట్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టెలివిజన్ జట్టు, తొలి ఇన్నింగ్స్ లో 166 పరుగులు సాధించింది. అటు సుయి నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ జట్టు మొదటి న్యూస్ లో 238 పరుగులు సాధించింది. ఆ తర్వాత పాకిస్తాన్ టెలివిజన్ 111 పరుగులకు రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలింది. ఇటు సుయి నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ జట్టు 37 పరుగులకు ఆల్ అవుట్ కావడంతో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది పాకిస్తాన్ టెలివిజన్.

Advertisement

Also Read: Shubman Gill water purifier : ఇండోర్ లో మూడో వ‌న్డే..గిల్ కోసం స్పెష‌ల్ వాట‌ర్ ఫ్యూరిఫైర్‌..ఎన్ని ల‌క్ష‌లంటే

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×