Women’s T20 World Cup 2026: టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s T20 World Cup tournament) నుంచి పాకిస్తాన్ క్రికెట్ టీం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. వరుసగా గ్రూప్ స్టేజ్ లో మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది పాకిస్తాన్. ఈ క్రమంలో ఈ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై (Pakistan Womens Team) దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఫైనల్స్ లో టీమిండియాను ఓడిస్తామని విర్రవీగిన పాకీలు, ఇప్పుడు గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయ్యారంటూ సెటైర్లు పేల్చుతున్నారు ఇండియన్స్. దారుణంగా ఆడుకుంటున్నారు.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s T20 World Cup tournament) నుంచి ఎలిమినేట్ అయిన నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న పాకిస్తాన్, ఓ వింత వాదనను తెరపైకి తీసుకువచ్చింది. ఐసీసీ చైర్మన్ పదవిలో ఇండియాకు సంబంధించిన జై షా (Jay Shah) ఉన్నాడని.. అతడి చేతుల మీదుగా టీ20 ప్రపంచ కప్ అందుకోవడం ఇష్టం లేక, తాము కావాలనే ఓడిపోయామని చెబుతున్నారు. ఇప్పటికే ఇదే విషయాన్ని పాకిస్తాన్ పురుషుల మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వెల్లడించగా.. ఇప్పుడు ఆ దేశ అభిమానులు కూడా ఇదే విషయాన్ని పేర్కొంటున్నారు.
ఒక భారతీయుడి చేతుల మీదుగా పాకిస్తాన్ టైటిల్ అందుకోవడానికి వీల్లేదని.. అందుకే మా వాళ్లు ఇంటిదారి పట్టారని అంటున్నారు. పాకిస్తాన్ పరువు కాపాడేందుకు, కావాలని గ్రూప్ స్టేజిలో ఎలిమినేట్ అయ్యారని పోస్టులు వైరల్ చేస్తున్నారు. ఎప్పుడైతే జై షా తన పదవి నుంచి తప్పుకుంటాడో.. అప్పటి వరకు ఐసీసీ ట్రోఫీలు తాము కొట్టబోమని పేర్కొంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రచ్చ చేస్తున్నారు పాకిస్తాన్ అభిమానులు.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మొత్తం 12 జట్లు ఆడుతున్నాయి. అయితే ఇందులో గ్రూప్ A లో టీమిండియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ( Pakistan Women Team) అలాగే నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. అయితే ఈ టోర్నమెంట్లో టీమిండియా, దక్షిణాఫ్రికా అలాగే బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో గ్రూప్ స్టేజి లోనే పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది. ఈ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన పాకిస్తాన్ కు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. 2028 టి20 ప్రపంచ కప్ (2028 Women’s T20 World Cup tournament) ఆతిథ్య హక్కులు పాకిస్తాన్ కోల్పోవాల్సి వచ్చింది.