Ambati Rayudu On Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా వ్యవహారం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ అయింది. ముంబై ఇండియన్స్ జట్టును వదిలేసి వచ్చే సీజన్ లో మరో ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా ఆడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఐపీఎల్ 2026 టోర్నమెంట్ జరుగుతున్న సమయంలోనే ఈ న్యూస్ బయటకు రావడంతో, హార్దిక్ పాండ్యా కోసం చాలా జట్లు ఎగబడ్డాయి. ఇప్పటికి కూడా ఐపీఎల్ ట్రేడ్ ద్వారా అతడిని సొంతం చేసుకునేందుకు సంసిద్ధమవుతున్నాయి. చర్చలు జరుపుతున్నాయి. ఇలాంటి క్రమంలో హార్దిక్ పాండ్యా గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హార్దిక్ పాండ్యా కు కెప్టెన్సీ ఇస్తారని కొంతమంది ప్రచారం చేస్తుంటే… మరికొంతమంది అతడికి 20 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసేందుకు జట్లు సిద్ధంగా ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు.
హార్దిక్ పాండ్యా ట్రేడ్ అంశం సోషల్ మీడియాలో హైలెట్ అయిన నేపథ్యంలో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు స్పందించారు. హార్దిక్ పాండ్యా వ్యవహారం ఇప్పుడు హాట్ హాట్ గా ఉందని పేర్కొన్నారు. అయితే, ఊసరవెల్లి రంగులు మార్చినట్లుగానే హార్దిక్ పాండ్యా ఫ్రాంచైజీలను మార్చడం ఏ మాత్రం బాగాలేదని ఫైర్ అయ్యారు. ఇప్పటికే అతడు మూడుసార్లు జట్లు మారినట్లు బాంబు పేల్చారు. డబ్బుల కోసం కక్కుర్తి పడి, అందులో నుంచి ఇందులోకి.. ఇందులో నుంచి మరో దాంట్లోకి ఇలా జంప్ అవుతున్నాడని ఫైర్ అయ్యారు. ఇలాంటి వాడివల్ల, జట్ల ఒరిగేదేమి లేదని పాండ్యాను హేళన చేశారు అంబటి రాయుడు.
హార్దిక్ పాండ్యా ఫ్రాంచైజీలు మారడంపై అంబటి రాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముంబై ఇండియన్స్ జట్టులో ఎదిగిన హార్దిక్ పాండ్యా.. కెప్టెన్సీ ఆఫర్ ఇవ్వగానే గుజరాత్ టైటాన్స్ లోకి వెళ్లిపోయాడని మండిపడ్డారు. అక్కడికి వెళ్లిన తర్వాత టైటిల్ అందించి… మళ్లీ ముంబై ఆఫర్ ఇవ్వడంతో వెనక్కి వచ్చాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాయుడు. ముంబై ఇండియన్స్ లోకి వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా ప్రదర్శన చెత్తగా మారిందని విమర్శలు చేశారు.
దీంతో మళ్లీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ కోసం హార్దిక్ పాండ్య ఆశపడడం చాలా దారుణమని ఫైర్ అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో ఇలా చాలా జట్లను ఇప్పటికే హార్దిక్ పాండ్యా సంప్రదించాడని షాకింగ్ ఆరోపణలు చేశారు. ఎవరికో డబ్బులు ఇస్తే అందులోకి వెళ్లాల్సిందే అన్నట్లుగా హార్దిక్ పాండ్యా వ్యవహారం తయారైందని విమర్శలు చేశారు. ఒక ప్లేయర్ కు ఇలాంటి ఆలోచన ఉండకూడదని.. ఆటపైన దృష్టి పెడితేనే పేరు వస్తుందన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ లాగా ఒకే ఫ్రాంచైజీకి ఆడాలన్నారు.