Pakistan Plane for Victory Parade In Karachi: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో తొలి టెస్ట్ ఆగస్టు 19వ తేదీన లీడ్స్ వేదికగా జరిగింది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు… పాకిస్తాన్ జట్టును చాలా దారుణంగా ఓడించింది. ఇంగ్లాండ్ దెబ్బకు 103 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓడిపోయింది. ఈ ఓటమి నేపథ్యంలో నేపథ్యంలో పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి, దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అటు మాజీ క్రికెటర్లు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇంగ్లాండ్ సిరీస్ కంటే ముందే వెస్టిండీస్ పైన బాబర్ ఆజం సేన బంపర్ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే ఊపుతో ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ విజయం సాధించడం గ్యారెంటీ అని… అందరూ అనుకున్నారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఇద్దరు కలిసి పెద్ద ప్లాన్ చేశారట. ఇంగ్లాండ్ పైన తొలి టెస్టులో ఎలాగైనా పాకిస్తాన్ గెలుస్తుందని భావించి, కరాచీ వేదికగా భారీ పరేడ్ నిర్వహించేందుకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు లక్షల్లో ఖర్చుపెట్టి మరి… ఏర్పాట్లు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఒరేయ్ మెంటలోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్పగించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమర్శలు
ఈ ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. ఏర్పాట్లు చేసినంత సేపు కూడా పాకిస్తాన్… ఇంగ్లాండ్ జట్టుకు పోటీ ఇవ్వలేదు. కేవలం రెండున్నర రోజుల్లోనే, మొదటి టెస్ట్ లో ఓడిపోయింది పాకిస్తాన్. దీంతో పరేడ్ కాస్త ఉన్నఫలంగా రద్దు చేసుకుంది పాకిస్తాన్ సర్కార్. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ న్యూస్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పాకిస్తాన్ వెధవలు ఇంత దారుణంగా తయారయ్యారా ? ఆ దేశ ప్రధాని షరీఫ్ కూడా ఇంత దిగజారాడా ? అని ఫైర్ అవుతున్నారు. అయితే మరికొంతమంది పాకిస్తాన్ జట్టును సపోర్ట్ చేస్తున్నారు. ఒక మ్యాచ్ ఓడిపోతే ఇంత దారుణంగా ట్రోలింగ్ చేయాలా ? అసలు మీరు మనుషులేనా అని ఫైర్ అవుతున్నారు. పరేడ్ గురించి ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు కానీ.. కావాలని కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఒక మ్యాచ్ కే ఏ ప్రభుత్వమైనా పరేడ్ నిర్వహిస్తుందా? ఇదంతా ఇండియా చేస్తున్న కుట్ర అంటూ ఆగ్రహించారు. ఇండియా పై పాకిస్తాన్ గెలిచిన రోజే పరేడ్ నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు అక్కడి అభిమానులు. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మరో రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. ఇందులో కూడా పాకిస్తాన్ పై ఇంగ్లాండ్ గెలుచే ఛాన్సు ఉందని మరికొందరు అంటున్నారు.
పాకిస్తాన్ పైన కాదు, మీ మగతనం..ఆస్ట్రేలియాను 5-0 తేడాతో వైట్ వాష్ చేసి చూపించండి