Dinesh Karthik On ENG VS PAK: ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ అత్యంత దారుణమైన ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 19వ తేదీన ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ ( England vs Pakistan ) మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైంది. అంతకు ముందు వెస్టిండీస్ పై గెలిచిన ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టింది పాకిస్తాన్. కానీ ఇంగ్లాండ్ దెబ్బకు బొక్క బోర్లా పడింది. తొలి టెస్ట్ కేవలం రెండున్నర రోజుల్లోనే ఫినిష్ అయిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు 103 పరుగుల తేడాతో పాకిస్తాన్ దారుణమైన ఓటమి చవిచూసింది. అయితే పాకిస్తాన్ ఓడిపోయిన నేపథ్యంలో ఆ జట్టును ఉద్దేశించి సోషల్ మీడియాలో దారుణంగా పోస్టులు పెడుతున్నారు. ఆ జట్టు ప్లేయర్లను హేళన చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ వెధవలు..ఇంగ్లాండ్ ను హాలీడే ట్రిప్ గా ట్రీట్ చేస్తున్నారని దినేష్ కార్తీక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసిన నేపథ్యంలో దినేష్ కార్తీక్ కూడా స్పందించారు. ఇంగ్లాండ్ పై గెలిచేందుకు పాకిస్తాన్ ప్లేయర్లు ఒక్క క్షణం కూడా ప్రయత్నించలేదని పరువు తీశారు. అసలు ఇంగ్లాండ్ సిరీస్ ను హాలిడే ట్రిప్ లాగా పాకిస్తాన్ ప్లేయర్లు ట్రీట్ చేసినట్లు తనకు అనిపించిందని బాంబు పేల్చారు. అంతేకానీ ఎవరు కష్టపడలేదని… ఏదో అలా వచ్చి బ్యాటింగ్ చేసి వెళ్లిపోయినట్లున్నట్లు తనకు అనిపించిందని పరువు తీశారు.
ఒరేయ్ మెంటలోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్పగించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమర్శలు
బాబర్ ఆజం కూడా ఈ విషయాన్ని ముందే గ్రహించి… గాయం పేరుతో తప్పుకున్నాడని ఆరోపణలు చేశారు. ఆ గాయం నిజంగానే అయిందో? లేక కావాలనే డ్రామాలు చేస్తున్నాడో తెలియదు కానీ… తొలి టెస్ట్ ఓటమి నుంచి చాలా తెలివిగా బాబర్ ఆజం ఎస్కేప్ చేసుకున్నాడు అన్నారు. ఇక ప్రస్తుత కెప్టెన్ సల్మాన్ అలీనే ఈ ఫెయిల్యూర్ బాధ్యతను తీసుకోవాలని కోరారు. వాస్తవానికి సల్మాన్ కెప్టెన్ గా ఈ మ్యాచ్ లో ఒక్కసారి కూడా సక్సెస్ కాలేదని చురకలు అంటించారు. అతడికి కెప్టెన్సీ చేతకాదని పరువు తీశారు.
లీడ్స్ వేదికగా పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs Pakistan ) మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి 171 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండు 409 పరుగులు చేసి కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పాకిస్తాన్ 135 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో రెండున్నర రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్ అయింది. ఈ క్రమంలోనే మూడు టెస్టుల సిరీస్ లో 1-0 లీడ్ సంపాదించింది ఇంగ్లాండ్.