E-Paper
Advertisement

Prakash Raj: జెమిమాను యేసు ప్రభు న‌ట్టేట ముంచేశాడు..స్మృతిని తిరుమ‌ల శ్రీవారు క‌రుణించాడు ?

Prakash Raj: జెమిమాను యేసు ప్రభు న‌ట్టేట ముంచేశాడు..స్మృతిని తిరుమ‌ల శ్రీవారు క‌రుణించాడు ?
Advertisement

Prakash Raj:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( WPL 2026) విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB ) నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు అద్భుతంగా రాణించి ఛాంపియన్ అయింది. 2024 లో టైటిల్ గెలిచిన బెంగళూరు, ఈ సీజన్ లో కూడా టైటిల్ గెలవడం జరిగింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కంటే ముందు స్మృతి మందాన ( Smriti Mandhana) పెళ్లి రద్దయినప్పటికీ కూడా తన గుండెను రాయి చేసుకుని జట్టును గెలిపించారు. దీంతో స్మృతి మందాన పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ కావడంపై కొత్త వివాదం తెరపైకి వచ్చింది. తిరుమల శ్రీవారు వర్సెస్ జీసస్ ( Jesus) అన్నట్లుగా వ్యవహారం తయారయింది.

Also Read: Smriti Mandhana Mother: ప‌లాష్ పెద్ద మోస‌గాడు..వాడిపై ప‌గ‌తో నా బిడ్డ ఆడింది, RCB విజ‌యంపై స్మృతి త‌ల్లి పోస్ట్‌ వైర‌ల్

తిరుమల శ్రీవారి అన్నతోనే బెంగళూరుకు టైటిల్

Advertisement

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు టైటిల్ గెలవడంపై సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కంటే ముందు తిరుమల శ్రీవారిని బెంగళూరు కెప్టెన్ స్మృతి మందాన దర్శించుకున్నారు. అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కారణంగానే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిందని సోషల్ మీడియాలో నెటిజెన్స్ పోస్టులు చేస్తున్నారు. అటు ఫైనల్ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు ( Delhi Capitals) కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues) అన్న సంగతి తెలిసిందే. జీసస్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అండగా ఉన్నప్పటికీ వాళ్ళు గెలవలేకపోయారని పేర్కొంటున్నారు. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును మాత్రం తిరుమల శ్రీవారు గెలిపించాడని అంటున్నారు. అంతేకాదు తిరుమల శ్రీవారి సన్నిధిలో బెంగళూరు కెప్టెన్ స్మృతి మందాన ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ గా మారాయి.

ప్రకాష్ రాజు అదిరిపోయే కౌంటర్

తిరుమల శ్రీవారి చేతిలో జీసస్ ఓడిపోయాడని జెమిమా, స్మృతి మందాన ఫోటోలను షేర్ చేయడంపై నటుడు ప్రకాష్ రాజ్ ( Actor and politician Prakash Raj ) చాలా సీరియస్ అయ్యాడు. ఇదేం విష ప్రచారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొంచమైనా బుద్ధుందా? క్రీడాలకు, మతాలకు పొత్తు పెడతారా అని నిప్పులు చెరిగాడు. అయామ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో ఈ పోస్టర్ పై కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది. ప్రకాష్ రాజ్ ఇన్వాల్వ్ కావడంతో అటు బిజెపి నేతలు ( BJP) కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. తిరుమల శ్రీవారి ( Tirumala) వల్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) విజయం సాధించిందని అంటున్నారు.

Advertisement

Also Read: Paul Van Meekeren Trolls Pak: మూడు చెరువుల నీళ్లు తాగించాం, పాకిస్తాన్ ది అస‌లు గెలుపే కాదు..ఇజ్జ‌త్ తీసిన నెదర్లాండ్స్ బౌలర్

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×