E-Paper
Advertisement

డ్రెస్సింగ్ రూంలో మొబైల్స్…ప్ర‌మాదంలో వైభ‌వ్ కెరీర్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై బ్యాన్ !

డ్రెస్సింగ్ రూంలో మొబైల్స్…ప్ర‌మాదంలో వైభ‌వ్ కెరీర్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై బ్యాన్ !
Advertisement

Ban On Rajasthan Royals:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 16 మ్యాచులు పూర్తయ్యాయి. నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Rajasthan Royals vs Royal Challengers Bengaluru) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు సరికొత్త వివాదంలో చిక్కుకుంది. రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భింద‌ర్ ( Romi Bhinder ) డ‌గౌట్ లో కూర్చొని మొబైల్ ఫోన్ ( Mobile phones ) వాడుతూ కనిపించాడు. వాస్తవానికి డ్రెస్సింగ్ రూమ్, డగౌట్ లో ఫోన్స్ వినియోగించడం నిషేధం. కానీ ఈ రూల్స్ బ్రేక్ చేసి రాజస్థాన్ రాయల్స్ పెద్ద తప్పిదమే చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ పై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Vaibhav Sooryavanshi: బుమ్రా, హేజిల్‌వుడ్‌, భువ‌నేశ్వ‌ర్ ఎవడైతే నాకేంటి ? కొడితే అవ‌త‌ల ప‌డాల్సిందే

డ్రెస్సింగ్ రూంలో మొబైల్స్…రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పై బ్యాన్ !

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ వివాదంలో చిక్కుకుంది. గౌహతీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ టీం మేనేజర్ రోమీ భింద‌ర్ ( Romi Bhinder ) డ‌గౌట్ లో కూర్చొని మొబైల్ ఫోన్ వాడాడు. ఇక పక్కనే వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వైభ‌వ్ కు కూడా చిక్కులు రానున్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

బీసీసీఐ రూల్స్ ప్రకారం డ్రెస్సింగ్ రూమ్స్, డ‌గౌట్ లో మొబైల్ ఫోన్ అసలు వాడకూడదు. అలా వాడితే కచ్చితంగా చర్యలు ఉంటాయి. అయితే రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమీ భింద‌ర్, ఈ తప్పిదం చేసిన నేపథ్యంలో.. బీసీసీఐ యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిపై క్రికెట్ విశ్లేషకులు కూడా స్పందిస్తున్నారు. మ్యాచ్ జరుగుతుండగా మొబైల్ ఫోన్ వాడిన నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ పై బ్యాన్‌ విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

మొబైల్ ఫోన్ వాడితే బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ?

Advertisement

డ్రెస్సింగ్ రూమ్, డ‌గౌట్ లో మొబైల్ ఫోన్స్ లేదా ఎలక్ట్రిక్ వస్తువులు వాడడంపై మొదటి నుంచి బీసీసీఐ నిషేధం విధించింది. ఐసీసీ ఆదేశాల ప్రకారం బీసీసీఐ కూడా ఈ రూల్స్ అమలు చేస్తోంది. ఇక ఈ నిబంధనలను ఉల్లంఘించిన రాజస్థాన్ రాయల్స్ పైన కచ్చితంగా భారీ ఫైన్ విధిస్తారని అంటున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ లాంటివి జరిగినట్లయితే బ్యాన్‌ కూడా విధిస్తారు. రోమీ భింద‌ర్, వైభ‌వ్ త‌ప్పు చేశార‌ని అంటున్నారు. నిజంగానే త‌ప్పు చేస్తే, వైభ‌వ్ కు చిక్కులు వ‌స్తాయి. అటు యాంటీ కరప్షన్ యూనిట్ కూడా దీనిపైన విచారణ చేసే అవకాశాలు ఉంటాయి. మరి ఈ మొబైల్ వాడకం పైన బీసీసీఐ ఎలా ముందుకు వెళుతుందనే దానిపైన చూడాలి.

 

 

Also Read: Chahal Smoking: వివాదంలో యుజ్వేంద్ర చాహల్..సిగ‌రేట్ తాగి, న‌డిరోడ్డుపైనే..ఏం బ‌తుకురా నీది

?igsh=MTh1b2FzOXliY3FjcQ==

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×