CSK VS RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 10 మ్యాచ్లు పూర్తయ్యాయి. కొన్ని జట్లు మంచి పర్ఫామెన్స్ చూపిస్తుంటే మరికొన్ని జట్లు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే 11వ మ్యాచ్లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings vs Rajasthan Royals ) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. గౌహతిలోని బార్సపారా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో… రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య… మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన…రాజస్థాన్ రాయల్స్… ఆరు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. చేజింగ్ సమయంలో… 20 ఓవర్లు వాడిన చెన్నై సూపర్ కింగ్స్… ఆరు వికెట్లు నష్టపోయి 176 పరుగులు మాత్రమే వచ్చేసింది. దీంతో ఈ మ్యాచ్ లో ఆరు పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది రాజస్థాన్ రాయల్స్. చివర్లో ధోని ఆడతాడు అనుకుంటే… సందీప్ శర్మ వేసిన అద్భుత బంతికి ఔట్ అయ్యాడు. అప్పటికే చెన్నై ఓటమి ఖరారు అయిపోయింది.
Also Read: HCA: SRH యాజమాన్యంతో గొడవలు… క్లారిటీ ఇచ్చిన HCA!
ఇది ఇలా ఉండగా… ఈ మ్యాచ్ లో… చెన్నై సూపర్ కింగ్స్ మొదట టాస్ గెలిచింది. టాస్ గెలిచిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో… రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్లో బ్యాటర్లు రాణించినప్పటికీ… కాప్ ఆర్డర్ అలాగే లోయర్ ఆర్డర్లో రాజస్థాన్ రాయల్స్ విఫలమైంది. దీంతో 250 వరకు పరుగులు చేయాల్సిన రాజస్థాన్ రాయల్స్… నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మొదటి మ్యాచ్ లోనే ఫైన్ ?
నితిస్ రానా అద్భుత ఇన్నింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Chennai Super Kings vs Rajasthan Royals ) మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు నితీష్ రానా ( Nitish Rana ) అద్భుతంగా ఆడాడు. 36 బంతుల్లోనే.. 81 పరుగులు చేశాడు నితీష్ రానా. ఇందులో ఐదు సిక్సర్లు, పది బౌండరీలు ఉన్నాయి. ఏకంగా 225 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపాడు నితీష్ రానా ( Nitish Rana ). అటు సంజు శాంసన్ 16 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్సర్ తో పాటు ఒక బౌండరీ ఉంది. యశస్వి జైస్వాల్ నాలుగు పరుగులు మాత్రమే చేసి ఒకటి అయ్యాడు. ఇప్పటివ రకు ఈ టోర్నమెంట్లో యశస్వి జైస్వాల్.. పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. రియాన్ పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 20 బంతుల్లో 37 పరుగులు చేశాడు రియాన్ పరాగ్. చివర్లో ఏ ఒక్క ఆటగాడు నిలవకపోవడంతో.. 182 పరుగులు మాత్రమే చేసింది రాజస్థాన్ రాయల్స్.