E-Paper
Advertisement

స‌చిన్ కంటే విరాట్ కోహ్లీనే గొప్పోడు…చిచ్చు పెట్టిన పాకిస్తాన్ !

స‌చిన్ కంటే విరాట్ కోహ్లీనే గొప్పోడు…చిచ్చు పెట్టిన పాకిస్తాన్ !
Advertisement

Ramiz Raza on Kohli-Sachin: టీమిండియా క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ ను విరాట్ కోహ్లీ ముందు కించపరిచేలా పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కంటే విరాట్ కోహ్లీ గొప్ప క్రికెటర్ అని ప్రశంసించారు. టీమిండియాను సచిన్ కంటే ఎక్కువగా గెలిపించింది విరాట్ కోహ్లీ అని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో సచిన్ టెండూల్కర్ వల్ల టీమిండియా కు పెద్దగా లాభం జరగలేదని పరువు తీసే ప్రయత్నం చేశారు.

స‌చిన్ కంటే విరాట్ కోహ్లీనే గొప్పోడు…చిచ్చు పెట్టిన పాకిస్తాన్ !

కానీ చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ… 100కు 200% కష్టపడి టీమిండియాను ఈ స్థాయికి తీసుకువచ్చాడని ప్రశంసించారు. గతంలో కెప్టెన్ గా వ్యవహరించిన సచిన్ టెండూల్కర్ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేదని ఆగ్రహించారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా చాలా బలంగా తయారైందని గుర్తు చేశారు. అందుకే తనకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం అన్నారు రమీజ్ రాజా. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ అలాగే విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శ‌క్తి, టీమిండియాకు లేదు

సచిన్ సెంచరీ చేస్తే టీమిండియా ఓడిపోవడమే

సచిన్ టెండూల్కర్ ఇప్పటివరకు తన కెరీర్లో చాలా సెంచరీలు నమోదు చేశారు. ఇప్పటివరకు టెస్టుల్లో 51, వన్డేలలో 49 సెంచరీలు నమోదు చేశాడు సచిన్ టెండూల్కర్. అంటే మొత్తంగా 100 సెంచరీలు చేసిన మొనగాడు సచిన్. అలాంటి సచిన్ టెండూల్కర్ పరువు తీస్తూ రమీజ్ రాజా మరో బాంబు పేల్చాడు. సచిన్ టెండూల్కర్ సెంచరీ చేస్తే టీమిండియా ఓడిపోవడం చాలా సార్లు చూసానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతడు సెంచరీ చేస్తే కచ్చితంగా టీమిండియా ఓడిపోతుందని బాంబు పేల్చారు. ఇలాంటి సంఘటనలు తన ముందు చాలానే జరిగాయని వెల్లడించారు. అందుకే అతడు చాలాసార్లు 90 లోనే కావాలనే అవుట్ అయినట్లు కూడా ఆరోపణలు చేశారు.

Advertisement

అయితే రమీజ్ రాజా ( Ramiz Raza ) చెప్పినట్లుగా రికార్డులు దాదాపు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో సెంచరీలు చేసి 20 మ్యాచ్లు గెలిపించాడు. 20 డ్రా అయ్యాయి. 11 ఇంటిలో ఓడిపోయింది టీమిండియా. వన్డేలలో 33 సెంచరీలు చేసి విక్టరీ అందించాడు. 14 మ్యాచ్ లలో సెంచరీలు చేసినా కూడా టీమిండియా ఓడిపోయింది. రెండు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. అదే విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే మాత్రం ప్రతి మ్యాచ్ దాదాపు టీమిండియా విక్టరీ సాధించిందని రమీజ్ రాజా స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీ సాధించిన అన్ని రికార్డులు టీమిండియాలో మరో క్రికెటర్ సాధించడం కష్టమేనన్నారు. ఇక ముందు కూడా అలాంటి క్రికెటర్ టీమిండియా కు దొరకబోడని వివరించారు.

Virender Sehwag On 2027 Odi World Cup: బుమ్రాను ప‌క్క‌కు పెట్టి.. ష‌మీ, సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్ ల‌ను తీసుకోండి

Related News

15 ఏళ్ల వైభ‌వ్ ను చూసి సిక్స‌ర్లు కొట్ట‌డం నేర్చుకో.. బాబ‌ర్ ప‌రువు తీసిన క‌నేరియా

రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ అభిమానుల‌కు మోడీ స‌ర్కార్ బిగ్ షాక్ !

మహ్మద్ సిరాజ్ బ్యాట్ లో స్ప్రింగులు..చెక్ చేసిన లంక క్రికెట‌ర్లు

ఉస్మాన్ తారిక్ కు మరో అవ‌మానం…బౌలింగ్ ఇవ్వ‌కుండా ప‌రువు తీసిన కెప్టెన్

గాయాల పేరుతో డ్రామాలు చేసే వాళ్ల జీతాలు క‌ట్ చేయండి !

ఐపీఎల్ ఆడి, టీమిండియా ప్లేయర్ల ర‌హ‌స్యాలు రాబ‌ట్టాను

మ‌రో వివాదంలో రిష‌బ్ పంత్..బంతిని ఫుట్ బాల్ లాగా త‌న్ని మ‌రీ

Big Stories

Advertisement
×