BigTV English
Advertisement

RCB Fans In Pakistan: పాకిస్థాన్ లో RCB జపం.. ఈ సారైనా కప్ కొట్టాల్సిందే అంటూ ?

RCB Fans In Pakistan:  పాకిస్థాన్ లో RCB జపం.. ఈ సారైనా కప్ కొట్టాల్సిందే అంటూ ?

RCB Fans In Pakistan:  చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్  ( Champions Trophy 2025 Tournament ) పాకిస్తాన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అలాగే ఇండియాకు… పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఫాలోయింగ్ తెరపైకి వస్తోంది. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇండియా మ్యాచ్ లు అన్ని దుబాయిలో జరుగుతున్నాయి. మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్లోని లాహోర్, గడాఫీ, కరాచీ స్టేడియాలలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. పాకిస్తాన్ లోని ( Pakisthan ) వేదికల్లో మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో.. విరాట్ కోహ్లీ కి ఫ్యాన్ బేస్ ఎంతుందో స్పష్టంగా అర్థం అవుతుంది.


Also Read: Afg vs Eng: 177 పరుగులతో రెచ్చిపోయి ఇబ్రహీం కొత్త చరిత్ర … ఇంగ్లాండ్ ముందు కొండంత టార్గెట్ ?

ఎక్కడ చూసినా విరాట్ కోహ్లీ జపం చేస్తున్నారు పాకిస్తాన్ అభిమానులు. విరాట్ కోహ్లీ ( RCB) సెంచరీ చేస్తే మొన్న… పాకిస్తాన్లోనే సంబరాలు చేసుకున్నారు. తమ దేశం పైన విరాట్ కోహ్లీ ( Virat Kohli ) సెంచరీ చేస్తుంటే… అక్కడి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది అభిమానులు.. పాకిస్తాన్ గడ్డపైన ఇండియా జాతీయగీతం పాడుతున్నారు. అక్కడితో ఆగకుండా పాకిస్తాన్ ( Pakisthan ) ఓడిపోతుందన్న సమయంలో.. ఆ దేశానికి సంబంధించిన జెర్సీని తొలగించి టీమిండియా జెర్సీ ని వేసుకుంటున్నారు.


ఇలా పాకిస్తాన్లో ఎక్కడ మ్యాచ్ జరిగిన…. ఇదే పరిస్థితి నెలకొంటుంది. పాకిస్తాన్ లో.. ఇండియా కంటే ఎక్కువ అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఆఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన కృషియల్ మ్యాచ్లో… ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team ) జెర్సీని ధరించి… ఓ పాకిస్తాన్ అభిమాని రచ్చ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో భాగంగా గడాఫీ వేదికగా… ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య… శివరాత్రి రోజున మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా.. ఓ పాకిస్తాన్ అభిమాని ఆర్సిబి జెర్సీ ( Royal Challengers Bangalore team jersy) ధరించి…గడాఫీ స్టేడియంలో ( Gadafi stadium ) రచ్చ చేశాడు. విరాట్ కోహ్లీ పేరు జపం చేస్తూ…. ఆర్ సి బి గెలవాలని కోరుతున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు సోషల్ మీడియాలో వారు అయ్యాయి. దీంతో ఆర్సిబి… మానియా పాకిస్తాన్ వరకు వెళ్లిందని.. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్.. మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నమెంట్లో మొదటగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందట. ఇది అధికారికంగా ప్రకటించినప్పటికీ… నేషనల్ మీడియాలో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుందట.

Also Read: Rohit Sharma – Dilip: దుబాయ్ రోడ్లపై రోహిత్… వైన్ షాప్ కోసమే అంటూ ట్రోలింగ్?

Related News

Kranti Gaud: 2012 జాబ్ పీకేశారు, కానీ లేడీ బుమ్రా దెబ్బ‌కు తండ్రికి పోలీస్ ఉద్యోగం..ఇది క‌దా స‌క్సెస్ అంటే

MS Dhoni: ధోని ఒకే ఒక్క ఆటోగ్రాఫ్‌..రూ.3 ల‌క్ష‌లు కాస్త, రూ.30 కోట్లు ?

RCB For Sale: RCB పేరు మార్పు, ఇక‌పై ZCB…బెంగ‌ళూరు జ‌ట్టుకు కొత్త ఓన‌ర్ ఎవ‌రంటే ?

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

Big Stories

×