E-Paper
Advertisement

Rajasthan Royals: రాజస్థాన్ కొంపముంచిన ఐపిఎల్ రూల్స్… ప్లేయర్స్ అందరి పైన వేటు

Rajasthan Royals: రాజస్థాన్ కొంపముంచిన ఐపిఎల్ రూల్స్… ప్లేయర్స్ అందరి పైన  వేటు
Advertisement

Rajasthan Royals: ఐపీఎల్ 2025 సీజన్ లో 23వ మ్యాచ్ బుధవారం రోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ – గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ని ఓడించింది గుజరాత్. దీంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో రెండవ స్థానం నుండి అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానం నుండి రెండవ స్థానానికి చేరింది.

 

Advertisement

ఈ సీజన్ లో వరుసగా నాలుగు విజయాలతో గుజరాత్ ఖాతాలో గరిష్టంగా 8 పాయింట్లు చేరాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ ఐదవ మ్యాచ్ లో మూడవ ఓటమిని చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్ పై 58 పరుగుల తేడాతో విజయం సాధించింది గుజరాత్ టైటాన్స్. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏడవ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరో గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ సంజూ శాంసన్ తో పాటు ఆ జట్టు ఆటగాళ్లు అందరిపై భారీ జరిమానా విధించారు ఐపీఎల్ నిర్వాహకులు.

బుధవారం రోజు గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణమే రాజస్థాన్ రాయల్స్ జరిమానాకి కారణం. నిర్ణీత సమయంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు 20 ఓవర్లను పూర్తి చేయలేకపోయారు. అంతేకాకుండా ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ స్లో ఓవర్ రేట్ కీ పాల్పడడం ఇది రెండవసారి. ఈ మ్యాచ్ కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లోను ఇదే జరిగింది. ఆ సమయంలో గాయపడిన సంజూ శాంసన్ స్థానంలో స్టాండ్ ఇన్ కెప్టెన్ గా వచ్చిన రియాన్ పరాగ్ కి 12 లక్షల జరిమానా విధించారు.

Advertisement

ఇప్పుడు గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి స్లో ఓవర్ రేట్ కి పాల్పడడంతో.. రెండవసారి భారీ జరిమానా విధించారు. కెప్టెన్ సంజు శాంసన్ కి ఏకంగా 24 లక్షల ఫైన్, ఇంపాక్ట్ ప్లేయర్ తో పాటు తుది జట్టులోని మిగిలిన ప్లేయర్స్ కి కూడా 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజు లో 25% జరిమానా విధించనున్నట్లు ఐపీల్ మీడియా ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read: Riyan parag: రియాన్ పరాగ్ ఔట్ పై వివాదం.. ఫిక్సింగ్ జరిగిందా

ఇక ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లలో.. మూడు మ్యాచ్లలో ఓడిపోయింది. గుజరాత్ – రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనంతరం భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 19.2 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. వరుసగా రెండు మ్యాచులు గెలిచిన రాజస్థాన్ విజయాల పరంపరకు అహ్మదాబాద్ లో బ్రేక్ పడింది.

 

 

View this post on Instagram

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×