Ramiz Raja : పాకిస్తాన్ క్రికెటర్లు చాలా వింతగా బిహేవ్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఎవరు అంచనా వేయలేని విధంగా వాళ్లు ప్రవర్తిస్తూ ఉంటారు. పాకిస్తాన్ ప్రీమియర్ గా చెప్పుకుంటున్న షాహిన్ అఫ్రిది కూడా ఇప్పుడు చాలా భిన్నంగా బౌలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురవుతున్నాడు. స్పిన్నర్ల తరహాలో 125 స్పీడ్ తో బంతులు సంధిస్తున్నాడు. అయితే షాహిన్ అఫ్రిది బౌలింగ్ వ్యవహారంపై తాజాగా రమీజ్ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోకాలి గాయం తర్వాత షాహిన్ అఫ్రిది పరిస్థితి చాలా దారుణంగా తయారైందని వెల్లడించారు. అతనిలో ఉన్న రిథమ్ మొత్తం పోయిందని విమర్శించారు. క్రికెట్ కు పనికిరాకుండా అయిపోయాడని బాంబ్ పేల్చారు.
మోకాలి గాయం తర్వాత షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో చాలా మార్పులు వచ్చాయని రమీజ్ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీమియర్ బౌలర్ కాస్త స్లో బౌలర్ అయ్యాడు అంటూ ఎద్దేవా చేశారు. మోకాలి గాయం తర్వాత అతని ప్రదర్శనతో పాటు ప్రవర్తనలో కూడా మార్పులు వచ్చాయని విమర్శలు చేశారు. కాస్త పొగరు కూడా అతడికి ఎక్కిందని ఫైర్ అయ్యారు రమీజ్ రాజా. మోకాలి గాయం తర్వాత 100% ఫిట్నెస్ కోల్పోయాడని తెలిపారు. అ మానసిక ఆందోళన ఎక్కువై… సరిగ్గా ప్రదర్శన చేయడం లేదని వెల్లడించారు.
గాయాలు ఉన్నప్పటికీ కూడా దాచుకుంటూ బుమ్రా తరహాలో బరిలో దిగుతున్నాడని ఫైర్ అయ్యారు. డబ్బుల కోసం… ఆడాల్సిందే అన్నట్లుగా షాహిన్ అఫ్రిది వ్యవహరిస్తున్నాడని ఫైరయ్యారు. అలాంటి వాళ్ల వల్ల పాకిస్తాన్ వరల్డ్ కప్ గెలవదని చురకలు అంటించారు. వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ నేపథ్యంలో తనకే కెప్టెన్సీ రావాలని షాహిన్ అఫ్రిది చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహించారు. సరిగ్గా బౌలింగ్ చేయని వాడు.. పాకిస్తాన్ జట్టును ఎలా డీల్ చేస్తాడని నిలదీశారు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఫోకస్ చేయాలని కోరారు.
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ ను బుమ్రాతో పాటు షాహిన్ అఫ్రిది వణికించారని రమీజ్ రాజా ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఈ ఇద్దరు తరచూ గాయాల బారిన పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో ఒక్క మ్యాచ్ ఆడి నాలుగు మ్యాచ్ లు గాయం కారణంగా దూరమవుతున్నారని విమర్శించారు. అయితే జట్టును గెలిపించడం కోసం కాకుండా డబ్బుల కోసం మాత్రమే వీళ్లు కక్కుర్తి పడి బరిలో దిగుతున్నారని ఫైర్ అయ్యారు. ఇలా గాయాలు దాచుకొని ఆడితే పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు. బుమ్రాతో పాటు షాహిన్ అఫ్రిది వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాలని సూచనలు చేశారు.