E-Paper
Advertisement

Salman Ali Agha: రూ.50 ల‌క్ష‌ల కోసం క‌ట్ట‌క‌ట్టుకుని గంగ‌లో దూకి చ‌స్తాం..PCBపై పాక్ కెప్టెన్ సీరియ‌స్‌

Salman Ali Agha: రూ.50 ల‌క్ష‌ల కోసం క‌ట్ట‌క‌ట్టుకుని గంగ‌లో దూకి చ‌స్తాం..PCBపై పాక్ కెప్టెన్ సీరియ‌స్‌
Advertisement

Salman Ali Agha:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో పాకిస్తాన్ అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. సూపర్ 8 దశలో కచ్చితంగా శ్రీలంకను కట్టడి చేయాల్సిన పాకిస్తాన్.. విఫలమై ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచ్ లో గెలిచినప్పటికీ ఫలితం దక్కలేదు. పాకిస్తాన్ ఇంటిదారి పట్టగా న్యూజిలాండ్ సెమీ ఫైనల్ కు వెళ్ళింది. అటు గ్రూప్ స్టేజిలో టీమిండియా చేతిలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. చిత్తుగా ఓడిపోయింది. అయితే టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన దానికంటే.. టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సీరియస్ అయింది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఒక్కో ప్లేయర్ 50 లక్షల పెనాల్టీ ( penalties ) కట్టాలని ఆదేశాలు జారీ చేసింది PCB. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక్కో పాకిస్తాన్ ప్లేయర్ PCB బోర్డుకు 16 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పెనాల్టీ పై తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ( Salman Ali Agha ) స్పందించారు. అంత మొత్తంలో ఫైన్ విధించడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తిరుగుబాటు చేశాడు.

Also Read: T20 World Cup Semi Final Schedule: మార్చి 4 నుంచే సెమీస్ రేస్‌..టీమిండియా షెడ్యూల్ ఇదే, వ‌ర్షం ప‌డితే ఎలా

50 లక్షల పెనాల్టీపై పాకిస్తాన్ కెప్టెన్ రియాక్షన్

Advertisement

50 లక్షలు పెనాల్టీ కట్టాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కెప్టెన్ సల్మాన్ అలీ స్పందించారు. అంత మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి తేవాలి ? టి20 వరల్డ్ కప్ ఆడితే మాకు వచ్చింది 29 లక్షలు.. మరింత అప్పు చేసి మీకు కట్టాలా ? ఇదెక్కడి న్యాయమని నిలదీశారు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ( Salman Ali Agha ). ఈ డబ్బుల కోసం గంగలో దూకి చస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రత్యర్థి జట్టు బలంగా ఆడితే మేమేం చేస్తాం.. మేం ప్రతి మ్యాచ్ చాలా సీరియస్ గా ఆడాం అని తెలిపారు. 200% మ్యాచ్ గెలిచేందుకు కష్టపడ్డాం… కానీ తమ కంటే బెటర్ గా ప్రత్యర్థి జట్టు ఆడినప్పుడు ఓటమి ఎదురైందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సల్మాన్ అలీ.

పాకిస్తాన్ టీం కావాలని ఎక్కడా ఓడిపోలేదు.. అలాంటప్పుడు తమ ప్లేయర్లపై ఇలా వేటు వేయడం ఏ మాత్రం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పునరాలోచన చేయాలని కోరారు. అంత మొత్తంలో డబ్బు చెల్లించేందుకు పాకిస్తాన్ క్రికెటర్లు కూడా సిద్ధంగా లేరని కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఇది ఇలా ఉండగా… టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గ్రూప్ స్టేజిలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 61 పరుగులు తేడాతో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది.

Advertisement

Also Read: Kris Srikkanth: ఈ ఒక్క వెధ‌వ స్వార్థం వ‌ల్లే, వెస్టిండీస్ సంక నాకి పోయింది…మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

 

 

 

Related News

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

Big Stories

Advertisement
×