E-Paper
Advertisement

Seven Players Padma Awards : ఏడుగురు క్రీడాకారులకు.. పద్మశ్రీ అవార్డు..

Seven Players Padma Awards : ఏడుగురు క్రీడాకారులకు.. పద్మశ్రీ అవార్డు..
Seven Players Padma Awards

Seven Players Padma Awards : రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుకు ఈసారి ఏడుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. వారిలో టెన్నీస్ స్టార్ బోపన్న, అగ్రశ్రేణి స్క్వాష్ క్రీడాకారిణి జ్యోష్న చిన్నప్ప, సతేంద్ర లోహియా (స్విమ్మింగ్ ),  హర్బీందర్ సింగ్ ( హాకీ), గౌరవ్ ఖన్నా ( బ్యాడ్మింటన్), ఉదయ్ విశ్వనాథ్ దేశ్ పాండే ( మల్లఖంబ, జిమ్నాస్టిక్స్ లాంటి ఆట) వీరందరూ పద్మశ్రీ అవార్డులు సాధించారు.

43 ఏళ్ల బోపన్న..

43 ఏళ్ల బోపన్న రెండు దశాబ్దాల పాటు డేవిస్ కప్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో ఫ్రెంచ్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్ లో కెనడా పార్టనర్ గాబ్రియేలా తో కలిసి గ్రాండ్ స్లామ్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఆసియా క్రీడల్లో ఓ డబుల్స్, ఓ మిక్స్ డ్ డబుల్స్ లో స్వర్ణం గెలిచాడు. ఏటీపీ ర్యాంకింగ్స్ పురుషుల డబుల్స్ విభాగంలో బోపన్న అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 43 ఏళ్ల వయసులో నెంబర్ వన్ ర్యాంకుకి చేరుకున్న తొలి ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పాడు.

 37 ఏళ్ల  స్క్వాష్ క్రీడాకారిణి జ్యోష్న

 37 ఏళ్ల  స్క్వాష్ క్రీడాకారిణి జ్యోష్న చిన్నప్ప ఆసియా క్రీడల్లో పలు పతకాలను గెలిచింది. 2022లో స్వర్ణం సాధించింది. అంతేకాదు డబుల్స్ లో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో నాలుగు పతకాలను గెలుచుకుంది.

36 ఏళ్ల సత్యేంద్ర సింగ్ లోహియా…

36 ఏళ్ల సత్యేంద్ర సింగ్ లోహియా వికలాంగ క్రీడాకారుడు. 2018 సంవత్సరంలో స్విమ్మింగ్ రిలే టీమ్‌లో భాగంగా ఇంగ్లీష్ ఛానల్‌ను దాటాడు. భారతదేశం నుండి మొదటిసారి నలుగురు పారా స్విమ్మర్లు ఇంగ్లీష్ ఛానల్‌ను దాటారు. సత్యేంద్ర సింగ్ 12 గంటల 26 నిమిషాల్లో ఛానెల్‌ని పూర్తి చేసి, సరికొత్త రికార్డును నెలకొల్పాడు.

47 ఏళ్ల పూర్ణిమ మహతో
పూర్ణిమ మహతో భారతీయ ఆర్చర్, ఇంకా  కోచ్ గా కూడా చేసింది.  1998 కామన్వెల్త్ క్రీడలలో రజత పతకాన్ని గెలిచింది. సమ్మర్ ఒలింపిక్స్‌లో భారత జాతీయ జట్టుకు కోచ్‌గా ఉంది.  2013లో  ద్రోణాచార్య అవార్డు లభించింది.

భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక అవార్డులలో పద్మశ్రీ అవార్డు నాల్గవది. మొదట భారత రత్న, తర్వాత పద్మ విభూషణ్, తర్వాత పద్మ భూషణ్, ఆ తర్వాత పద్మశీ అవార్డు ప్రత్యేకతను పొందింది. 2024 సంవత్సరంలో 110 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. అందులో ఏడుగురు క్రీడాకారులు ఉన్నారు.

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×