Shahid Afridi : టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s T20 World Cup tournament) విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా నిన్న లార్డ్స్ (Lord’s, London) వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్ మహిళల జట్టు, ఏడు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఇంగ్లాండ్ విధించిన టార్గెట్ ను ఆచితూచి ఆడిన ఆస్ట్రేలియా మహిళల జట్టు… చేదించి ఛాంపియన్ అయింది. ఈ క్రమంలో ఐసీసీ బాస్ జై షా చేతుల మీదుగా ఈ మహిళల టి20 ప్రపంచ కప్ ట్రోఫీని ఆస్ట్రేలియా అందుకుంది. అయితే జై షా ట్రోఫీ అందించడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దరిద్రుడు జై షా ట్రోఫీని అందించడం క్రికెట్ చరిత్రలోనే అవమానకర సంఘటన అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఐసీసీ ట్రోఫీ అందించే హక్కు, జై షాకు లేదని ఫైర్ అయ్యారు. ఇలాంటి సంఘటన జరుగుతుందని పాకిస్తాన్ క్రికెట్ జట్టు తొందరగా ఎలిమినేట్ అయినట్లు వ్యాఖ్యానించారు. దీంతో షాహిద్ అఫ్రిది (Shahid Afridi ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది
ఐసీసీ టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s T20 World Cup tournament) నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (England Women vs Australia Women, Final) మధ్య లార్డ్స్ వేదికగా నిన్న ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆదివారం జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మహిళలు జట్టు విజయకేతనం ఎగరవేసింది. దీంతో ఏడోసారి ట్రోఫీ దక్కించుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది. నిన్నటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ మహిళల జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా 20 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ మహిళలు జట్టు 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 153 పరుగులు సాధించింది ఆస్ట్రేలియా.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియా కు జై షా ట్రోఫీ అందించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక భారతీయుడు అయిన జై షా చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవాల్సి వస్తుందని పాకిస్తాన్ ముందుగానే గ్రహించి ఎలిమినేట్ అయిందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ పరువు కాపాడేందుకుగాను… తమ మహిళల జట్టు, భారీ త్యాగం చేసిందన్నారు. ఇక ఆస్ట్రేలియా మహిళా జట్టుకు జై షా, ట్రోఫీ అందించడం క్రికెట్ లోనే అవమానకర సంఘటన అంటూ వ్యాఖ్యానించారు. అతని చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడం అంటేనే అసహ్యంగా ఉందని బాంబు పేల్చారు.