Virender Sehwag: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య జరుగుతున్న టి20 సిరీస్ (England vs India, 2nd T20I, ) నేపథ్యంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. చివరి క్షణంలో సంజు శాంసన్ ను పక్కకు పెట్టిన గంభీర్… 15 ఏళ్ల కుర్రాడికి అవకాశం ఇచ్చారు. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన వైభవ్ (Vaibhav Sooryavanshi), కేవలం 14 పరుగులు చేసి వికెట్ సమర్పించుకున్నాడు. అయితే ఇందులో రెండు సిక్సర్లు ఉండడం గమనార్హం. ఇందులో ఒక సిక్సర్ జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతికి బాదేశాడు వైభవ్. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ సంఘటనపై టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. జోఫ్రా ఆర్చర్ (Jofra Archer ) బౌలింగ్ లో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ సిక్సర్ కొట్టి తనకు హ్యాపీ నెస్ ఇచ్చాడని, టీమిండియా ఓడిపోయిన బాధ లేకుండా చేశాడంటూ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో మీడిమా ముందు రెచ్చిపోయే జోఫ్రా ఆర్చర్ పరువు తీసేలా తొలి బంతికి సిక్సర్ కొట్టి… సరైన బుద్ధి చెప్పాడని వైభవ్ ను మెచ్చుకున్నారు. టీమిండియా ఓడినా పర్లేదు..ఆర్చర్ కు మాత్రం నరకం చూపించు వైభవ్ అంటూ సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ తర్వాత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ను పక్కకు పెట్టిన నేపథ్యంలో టీమిండియా ఇప్పుడు ఓటములను చవిచూస్తోందని వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనంతటికి కారణం గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ అంటూ మండిపడ్డారు. అనవసరంగా సూర్య కుమార్ యాదవ్ ను తప్పించి టీం లైన్ అప్ మొత్తం డిస్టర్బ్ చేశారని ఫైర్ అయ్యారు. సూర్యను పక్కకు పెట్టిన నేపథ్యంలో టీమిండియా ప్లేయర్స్ లో భయాందోళన నెలకొందని వ్యాఖ్యానించారు. అందుకే ఇండియన్ ప్లేయర్లు సరిగ్గా రావడం లేదన్నారు. టీం ఇండియాను లీడ్ చేసే దమ్ము శ్రేయస్ అయ్యర్ కు ఉందని… కానీ దానికి కాస్త సమయం పడుతుందన్నారు. అయితే అతడు ఒంటరిగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. మిగతా ప్లేయర్లు రాణించడం లేదని మళ్లీ పడ్డారు. రవి బిష్ణోయ్ ఓవర్ కారణంగానే రెండో టి20 టీమ్ ఇండియా ఓడిపోయిందన్నారు. వాస్తవానికి రవి అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని… కానీ దురదృష్టవశాత్తు శనివారం అతని టైం బాగా లేదన్నారు.
Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది