Shreyas Iyer : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ ( India tour of England, 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టి20 సిరీస్ నేపథ్యంలో శనివారం మాంచెస్టర్ వేదికగా టీమిండియా అలాగే ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ రెండో టి20 లో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది. చివరి వరకు బాగా ఆడిన టీమిండియా… రవి బిష్ణోయ్ చెత్త బౌలింగ్ కారణంగా చిత్తుగా ఓడాల్సి వచ్చింది. నాలుగు ఓవర్లలో ఏకంగా 60 పరుగులు ఇచ్చిన రవి బిష్ణోయ్ (Ravi Bishnoi)… టీమిండియా ఓటమికి మూల కారణంగా మారాడు. అయితే టీమిండియా ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఒక్క ఓవర్ కారణంగానే తమకు ఓటమి ఎదురైందని, పరోక్షంగా రవి బిష్ణోయ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో శ్రేయస్ అయ్యర్ (SHREYAS IYER ) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా రెండో టి20 జరిగింది. ఇందులో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. ఈ క్రమంలో టీమిండియా ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐర్లాండ్ సిరీస్ నుంచే, తమ ఆట తీరు సరిగ్గా లేదని ఆగ్రహించారు. ఏ ముహూర్తాన ఐర్లాండ్ వెళ్ళామో? అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని ఓటమిలే ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు. బ్యాటింగ్ లో బాగా ఆడితే… బౌలింగ్ లో విఫలమవుతున్నారని…. ఇక మరో మ్యాచ్ లో బౌలింగ్ అదరగొడితే.. బ్యాటింగ్ లో తేలిపోతున్నానని ఫైర్ అయ్యారు. ప్రతి విభాగంలో మెరుగుపడాల్సిన అవసరం తమ జట్టుకు ఉందని పేర్కొన్నారు. ఇకనైనా టీమిండియా పుంజుకుంటేనే… మంచి ఫలితం వస్తుందన్నారు. ఖచ్చితంగా ఓటమిని మరిచిపోయి, బౌన్స్ బ్యాక్ అవుతామని వెల్లడించారు.
రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్ కారణంగా టీమిండియా ఓడిపోయిందని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. అయితే దీనిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. కూడా రియాక్ట్ అయ్యారు. ఆ ఓవర్ వల్ల టీమిండియా ఓడిపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రవి బిష్ణోయ్ ని విలన్ చేయబోమని.. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని వివరించారు. బౌలింగ్ బాగా చేసినప్పటికీ… ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని నేర్చుకోవాల్సి ఉంటుందని చాలా ధీమాగా మాట్లాడారు సురేష్ శ్రేయస్ అయ్యర్.
Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది