Shahid Afridi: టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Ireland vs Team India) జట్ల మధ్య నిన్న టీ20 సిరీస్ ( India tour of Ireland, 2026 ) ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు జట్ల మధ్య నిన్న మ్యాచ్ జరగగా… ఇందులో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. పసికూన ఐర్లాండ్ ను లైట్ తీసుకున్న టీమిండియా, అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకుంది. అయితే ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. టీమిండియా పరువు తీస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) హాట్ కామెంట్స్ చేశారు. సొంత గడ్డపై తప్ప, విదేశీ పిచ్ లపై టీమిండియాకు గెలవడం చేతకాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే ఐర్లాండ్ (Ireland) లాంటి C టీమ్ చేతిలో దారుణంగా ఓడిపోయిందని సెటైర్లు పేల్చారు. ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిందన్న వార్త వినసొంపుగా ఉందని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు ఛాంపియన్ అని మొత్తుకున్న టీమిండియా, ఇప్పుడు ఐర్లాండ్ చేతిలో ఓడిపోయి, పళ్ళు రాలగొట్టుకుందని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య నిన్న టి20 సిరీస్ ప్రారంభం కాగా, శ్రేయస్ అయ్యర్ సేన చిత్తుగా ఓడిపోయింది. పసికూన ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓటమిపాలైన నేపథ్యంలో, పాకిస్తాన్ సోషల్ మీడియా, అక్కడి మాజీ క్రికెటర్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా టీమిండియాను దారుణంగా ర్యాగింగ్ చేశాడు. మొన్నటి వరకు ఛాంపియన్ అంటూ విర్రవీగిన టీమిండియా, ఐర్లాండ్ ముందు పళ్ళు రాలగొట్టుకుందని వ్యాఖ్యానించారు. టీమిండియా బలుపును మొత్తం ఐర్లాండ్ దించిందని ప్రశంసించారు.
ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని శునకానందం పొందారు. ఇండియాలో ఉన్న మైదానాలలో మాత్రమే వాళ్లు సరిగ్గా ఆడతారు… పెద్ద జట్టను ఓడిస్తారు అంటూ హేళన చేశారు. విదేశీ గ్రౌండ్లలో టీమిండియా.. ఐర్లాండ్ లాంటి పసి కూనల చేతిలో కూడా ఓడిపోతూ ఉంటుందని వెల్లడించారు. విదేశీ పిచ్ లపై ఓడిపోతున్న టీమిండియా పై పాకిస్తాన్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని హెచ్చరించారు. 2027 ప్రపంచ కప్ టోర్నమెంట్ దక్షిణాఫ్రికాలో జరగనుందని గుర్తు చేశారు. ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది కాబట్టి, దక్షిణాఫ్రికాలో టీమిండియా ఆటలు సాగబోవని బాంబు పేల్చారు. ఆ సమయంలో టీమిండియాను చిత్తుగా ఓడించి ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. అప్పుడే ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుందని వెల్లడించారు.