Shahid Afridi: పహల్గామ్ ( Pahalgam) సంఘటన జరిగి ఏడాది పూర్తయింది. సరిగ్గా ఏడాది కిందట ఈ పహల్గామ్ అనే పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు దాడి చేశారు. మారణ హోమం సృష్టించి ఏకంగా 26 కుటుంబాలను రోడ్డున పడేశారు. ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో ఇద్దరు స్థానికులు కుట్ర పన్నినట్లు అధికారుల విచారణలో తేలింది. అయితే ఈ దారుణ సంఘటన జరిగి ఏడాది కాలమైన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ( Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ సంఘటన వెనుక ఇండియన్ ఆర్మీ కుట్ర ఉందని బాంబు పేల్చారు షాహిద్ ఆఫ్రిది. ఇండియాలో రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఈ సంఘటన జరిగేలా ప్లాన్ చేశారని ఆరోపణలు చేశారు. దీంతో షాహిద్ ఆఫ్రిది ( Shahid Afridi ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంతేకాదు షాహిద్ అఫ్రిదికి సంబంధించిన చిత్ర పటాలను కాశ్మీర్ బార్డర్ లో కాల్చిపడేస్తున్నారు. షాహిద్ అఫ్రిదిని ఉరి తీయాలని బీజేపీ పార్టీ ( BJP) నేతలు డిమాండ్ చేస్తున్నారు.
పహల్గామ్ ( Pahalgam) సంఘటన జరిగి ఏడాది పూర్తయిన తరుణంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ( Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ సంఘటన జరుగుతుంటే, ఇండియన్ ఆర్మీ ఏం చేసింది ? అంటూ ఫైర్ అయ్యారు. పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు గంటసేపు కాల్పులు జరుపుతూంటే, ఆ ప్రాంతంలో ఉన్న ఆర్మీకి సమాచారం వెళ్లలేదా ? అంటూ ఆగ్రహించారు. పహల్గామ్ ఘటనకు సమీపంలో 8 లక్షల మంది ఇండియన్ ఆర్మీ ఉందని వెల్లడించారు. వీళ్లంతా ఉగ్రదాడి గురించి, సమాచారం ఉన్నప్పటికీ రివర్స్ ఎటాక్ చేయలేదని ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీకి అనుకూలంగా సంఘటనను మార్చుకునేందుకు ఇలా కుట్ర చేశారన్నారు. ఉగ్రవాదులు 26 మందిని చంపిన సినిమాల్లో పోలీసులు వచ్చినట్లుగా ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగిందని సీరియస్ అయ్యారు షాహిద్ అఫ్రిది. బీజేపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ఇండియన్ ఆర్మీ, నిందలను పాకిస్తాన్ పై వేసిందని మండిపడ్డారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిందన్నారు.
పహల్గామ్ సంఘటన సందర్భంగా 26 మంది పర్యాటకులను అన్యాయంగా చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు చుక్కలు చూపించింది ఇండియన్ ఆర్మీ. ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు మొత్తం 100 మంది ఉగ్రవాదులను మట్టి కరిపించింది. దాదాపు రెండు దేశాల మధ్య 20 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. S-400 లాంటి ఆయుధాలతో బరిలోకి దిగిన ఇండియా.. పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. ఆ తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం చేసి యుద్ధం ఆపారు.