Shoaib Akhtar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య సైలెంట్ గా టెస్ట్ సిరీస్ ముగిసిపోయింది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తుంది అనుకున్న పాకిస్తాన్, దారుణంగా ఓడిపోయింది. బంగ్లాదేశ్ చేతిలో వైట్ వాష్ అయింది. రెండు టెస్టుల్లో కూడా చిత్తు చిత్తుగా పాకిస్తాన్ జట్టును ఓడించిన బంగ్లాదేశ్.. స్వదేశంలో తొలిసారిగా టెస్టు సిరీస్ గెలుచుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ మాజీలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆట తీరుపై మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) చాలా సీరియస్ అయ్యారు. వీళ్ళ ప్రదర్శన చూస్తుంటే, తనకు అసహ్యం వేస్తోందని ఆగ్రహించారు. తనకు డబ్బులు వస్తున్నాయన్న ఒక్క కారణంతో పాకిస్తాన్ క్రికెట్ చూస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు. అల్లా మీద ఒట్టు… ఇక జన్మలో పాకిస్తాన్ ఆడే ఏ మ్యాచ్ చూడబోనని శపథం చేశారు. దీంతో మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) హాట్ కామెంట్స్ చేశారు. తనకు డబ్బులు వస్తున్నాయన్న ఒక్క కారణంతో… పాకిస్తాన్ ఆడే ప్రతి మ్యాచ్ చూస్తున్నాను… లేకపోతే వాళ్ళని అసలు పట్టించుకునే వాడిని కాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇకపైన అసలు పాకిస్తాన్ మ్యాచ్ లు చూడబోనని వ్యాఖ్యానించారు. ఒక్కడికి సరిగ్గా ఆడడం చేతకావడంలేదని మండిపడ్డారు. షాన్ మసూద్ ( Shan Masood) ఆటగాడికి ఎక్కువ.. కెప్టెన్ కు తక్కువ అన్నట్లుగా ఉన్నాడని సీరియస్ అయ్యారు. అతన్ని కెప్టెన్ చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ముందుగా తన్నాలి అంటూ మండిపడ్డారు. ఇలా అయితే పాకిస్తాన్ క్రికెట్ భూస్థాపితం కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు. తనకే పాకిస్తాన్ క్రికెట్ నచ్చడం లేదంటే… అభిమానులు అస్సలు పట్టించుకోరని వార్నింగ్ ఇచ్చారు.
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు గతంలో లాగా లేదని… ఆస్ట్రేలియా లాగా తయారయిందని పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా ( Ramiz Raja) సంచలన కామెంట్స్ చేశారు. ఆస్ట్రేలియా లాంటి బలమైన బౌలింగ్ తరహాలోనే బంగ్లాదేశ్ ఉందని.. అందుకే పాకిస్తాన్ ప్లేయర్లు ఓడిపోయారని చురకలు అంటించారు. అర్ధరాత్రుళ్ళు బంగ్లాదేశ్ బౌలింగ్ దళాన్ని తలచుకొని, పాకిస్తాన్ క్రికెటర్లు వణికిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
🚨 SHOAIB AKHTAR ANGRY STATEMENT ON PAKISTAN'S CRICKETERS 🚨
Shoaib Akhtar said 🗣️,
"I only watch cricket because I am getting paid otherwise no interest in Pakistan cricket for me. If they keep behaving/acting like this, then what else can we even say? Nobody in this team… pic.twitter.com/iDKcQxbMNT
— Cricket Central (@CricketCentrl) May 22, 2026